JC Prabhakar Reddy Fire on Jagan అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబ్బంది కొరత.. చంద్రబాబు కోసం వందల మంది పోలీసులు: జేసీ ఫైర్ - Protests in AP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 4:47 PM IST
JC Prabhakar Reddy Comments on Jagan: వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబ్బంది కొరత ఉందన్న పోలీసులు.. చంద్రబాబుని వందల మంది చుట్టుముట్టి అరెస్టుకు అంతమంది ఎక్కడి నుంచి వచ్చారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ, సీపీఐ, జనసేన పార్టీల శ్రేణులు నిరాహార దీక్షలు నిర్వహించాయి. ఈ దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులకు కూడా ఇదే గతి పడుతుందని ఆగ్రం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గమైన అధికార వ్యవస్థ ఎప్పుడూ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదహారు నెలలు జైల్లో ఉండి 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి, చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం ఆశ్చర్యం లేదన్నారు. వేల కోట్ల స్కాంలు చేసిన జగన్, చంద్రబాబుని జైలులో పెట్టించినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. యువత భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే చంద్రబాబుని అక్రమ అరెస్టుతో జైలులో పెట్టారని.. ఇప్పుడైనా ప్రజలు రోడ్లమీదకు రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని జేసీ హెచ్చరించారు. చంద్రబాబుని విడుదల చేసే వరకు నిరసన కొనసాగిస్తామని తెలుగుదేశం నేతలు హెచ్చరించారు. జగన్ మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేడే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీడీపీ నేతలు విమర్శించారు. నందమూరి బాలకృష్ణను రెచ్చగొట్టే విధంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారని సీపీఐ నేతలు ఆరోపించారు. రెచ్చకొట్టి, అక్రమ కేసులు పెడితే ఎవరూ భయపడేది లేదంటూ హెచ్చరించారు.