TDP Bus Yatra: చైతన్య రథయాత్రలో టీడీపీ, వైఎస్సార్​సీపీ నేతల మధ్య తోపులాట..

By

Published : Jul 17, 2023, 9:51 AM IST

thumbnail

TDP and YCP Leaders Dispute: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర టీడీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఈ యాత్రలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో చైతన్య రథయాత్ర సాగిన ఊర్లన్నీ పసుపుమయంగా మారాయి. అయితే ఈ యాత్రలో టీడీపీ, వైఎస్సార్​సీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బస్సు యాత్రలో భాగంగా.. మందస మండలం నల్లబొడ్లూరు గ్రామంలో.. గతంలో వైఎస్సార్​సీపీ నేతలు పూర్తిగా తవ్వేసిన కొండను పరిశీలించేందుకు టీడీపీ నేతలు.. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్సార్​సీపీ శ్రేణులు.. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.