పారిశుధ్య విధుల్లో బాలుడు, విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ షాక్ కొట్టి మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 12:05 PM IST

thumbnail

Boy Died With Current Shock in Annamayya District : అన్నమయ్య జిల్లా రాజంపేట నగర పంచాయతీలో పారిశుధ్య కార్మికునిగా విధులు నిర్వహిస్తూ ఓ బాలుడు విద్యుదాఘాతంలో మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున బాలుడు చేవూరి శ్రీనివాసులు పారిశుధ్య విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. పట్టణంలోని నూనెవారి పల్లి రోడ్డు సమీపంలో చెత్తను తొలగిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ షాక్ కొట్టి బాలుడు చేవూరి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. 

Miner Died With Short Circuit : మృతి చెందిన శ్రీనివాసులు అమ్మమ్మ నాగమ్మ నగర పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. నాగమ్మకు  అస్వస్తత కారణంగా తనకు బదులుగా పారిశుధ్య పనులకు శ్రీనివాసులు వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి విద్యుత్ షాక్ తగలడం అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి. తన బిడ్డను తనకు తెచ్చి ఇవ్వాలని బాలుని తల్లి రోదించడం స్థానికుల్ని కలచివేసింది. బాలుడిని  పారిశుధ్య పనులకు అధికారులు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదంటూ గ్రామస్తులు వాపోయారు. అలాగే  పట్టణ నడిబొడ్డున విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభావించిందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.