సీఎం సభలో సరదా సన్నివేశం, వైఎస్సార్పై పాట పాడిన బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య - బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16185134-660-16185134-1661333891843.jpg)
FUNNY INCIDENT ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజశేఖర్రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్పై బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత ఇక చాలని సీఎం జగన్ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి జగన్ లేచి వచ్చి వెంకాయమ్మను పట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST