ETV Bharat / state

అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ అన్బురాజన్

author img

By

Published : Apr 29, 2021, 4:57 PM IST

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై విజిలెన్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. కొవిడ్​ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెండు ఆస్పత్రులపై క్రిమినల్​ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు.

sp anburajan
ఎస్పీ అన్బురాజన్
ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్స ధరలపై మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్

కొవిడ్​ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై పోలీసులు, విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. కరోనా వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్​పై చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. కడప జిల్లా కేంద్రంలోని రెండు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్​ చికిత్స అందించాలని ఎస్పీ తెలిపారు. ఏ ఆస్పత్రిలో అయినా అధిక ఫీజులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా విపత్కర సమయంలో సేవ చేయాల్సిన బాధ్యతను వైద్యులకు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 'శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతి'

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్స ధరలపై మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్

కొవిడ్​ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై పోలీసులు, విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. కరోనా వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్​పై చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. కడప జిల్లా కేంద్రంలోని రెండు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్​ చికిత్స అందించాలని ఎస్పీ తెలిపారు. ఏ ఆస్పత్రిలో అయినా అధిక ఫీజులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా విపత్కర సమయంలో సేవ చేయాల్సిన బాధ్యతను వైద్యులకు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 'శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.