కడప జిల్లా రాయచోటిలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పాత రాయచోటిలోని ఈద్గా మైదానానికి ఉదయమే భారీగా చేరుకున్నారు. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేయించి.. ఖురాన్ గ్రంథంలోని బోధనలను వినిపించారు. దాన ధర్మాలు, సత్యం, సద్గుణం, సత్ప్రవర్తన వంటి నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి దేవుని అనుగ్రహం పొందాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో సహా పలువురు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి