ETV Bharat / state

స్వామీజీపై నమ్మకమే ప్రాణాలు తీసేలా చేసింది- విషాదాంతంగా సీఐ తల్లి మిస్సింగ్ కేసు

ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ మాతృమూర్తి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది - మృతిరాలి ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

dharmavaram_ci_mother_murdered
dharmavaram_ci_mother_murdered (ETV Bharat)

Dharmavaram CI Mother Murdered: ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. 62 ఏళ్ల స్వర్ణకుమారి హత్య కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తన అనారోగ్య సమస్యలకు స్వామీజీలను నమ్ముకోవడమే ఆమె మృతికి కారణమైంది. నగల కోసం ఇంటిపక్కన ఉన్న వ్యక్తే సీఐ తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం, అతడిచ్చిన సమాచారం మేరకు స్మశానంలో పూడ్చిపెట్టిన స్వర్ణ కుమారి శవాన్ని వెలికి తీసి అక్కడే పంచనమా నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే, అమ్మ చెరువు మిట్ట జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి (62) గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యారు. దీంతో ఈ నెల 2వ తేదీన స్వర్ణకుమారి బంధువుల మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వర్ణకుమారి స్మశానంలో శవమై కనిపించారు.

ఇంటి పక్కన వ్యక్తే హత్య: స్వర్ణకుమారిని ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేష్ హతురాలి ఇంటి సమీపంలోనే నివాసముంటు చాలా నమ్మకంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ ఆమెను ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం స్వామీజీ వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత స్వర్ణకుమారి ఇంటికి రాలేదు. దీన్ని గమనించిన స్థానికులు కొంతమంది సమాచారాన్ని మృతురాలి బంధువులకు అందించారు. అనుమానితుడిగా ఉన్న వెంకటేష్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకొని సమాచారం రాబట్టారు.

నగల కోసమే అఘాయిత్యం: నిందితుడు మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అయోధ్య నగర్ సమీపంలోని స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు. జరిగిన వ్యవహారం పోలీసులకు నిందితుడు వెంకటేష్ చెప్పి మృతదైహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. పోలీసులు మృతదైహాన్ని బయటకు తీసి అక్కడే పంచనామా నిర్వహించారు. కాగా నిందితుడు వెంకటేష్​తో పాటు మరో నిందితుడు అనిల్ కలసి స్వర్ణ కుమారిని హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. స్వర్ణ కుమారి వద్ద ఉన్న బంగారు నగల కోసమే వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్య జరిగిన మరుసటిరోజే వెంకటేష్ స్వర్ణ కుమార్​కి చెందిన నగలను పట్టణంలోని ఓ బంగారు నగర దుకాణంలో కుదువ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

"బరి తెగించారు" ఆన్​లైన్​లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు

విశాఖలో బైక్ కొట్టేసి తునిలో చైన్ స్నాచింగ్ - "షాకింగ్ విజువల్స్"

Dharmavaram CI Mother Murdered: ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. 62 ఏళ్ల స్వర్ణకుమారి హత్య కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తన అనారోగ్య సమస్యలకు స్వామీజీలను నమ్ముకోవడమే ఆమె మృతికి కారణమైంది. నగల కోసం ఇంటిపక్కన ఉన్న వ్యక్తే సీఐ తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం, అతడిచ్చిన సమాచారం మేరకు స్మశానంలో పూడ్చిపెట్టిన స్వర్ణ కుమారి శవాన్ని వెలికి తీసి అక్కడే పంచనమా నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే, అమ్మ చెరువు మిట్ట జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి (62) గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యారు. దీంతో ఈ నెల 2వ తేదీన స్వర్ణకుమారి బంధువుల మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వర్ణకుమారి స్మశానంలో శవమై కనిపించారు.

ఇంటి పక్కన వ్యక్తే హత్య: స్వర్ణకుమారిని ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేష్ హతురాలి ఇంటి సమీపంలోనే నివాసముంటు చాలా నమ్మకంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ ఆమెను ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం స్వామీజీ వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత స్వర్ణకుమారి ఇంటికి రాలేదు. దీన్ని గమనించిన స్థానికులు కొంతమంది సమాచారాన్ని మృతురాలి బంధువులకు అందించారు. అనుమానితుడిగా ఉన్న వెంకటేష్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకొని సమాచారం రాబట్టారు.

నగల కోసమే అఘాయిత్యం: నిందితుడు మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అయోధ్య నగర్ సమీపంలోని స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు. జరిగిన వ్యవహారం పోలీసులకు నిందితుడు వెంకటేష్ చెప్పి మృతదైహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. పోలీసులు మృతదైహాన్ని బయటకు తీసి అక్కడే పంచనామా నిర్వహించారు. కాగా నిందితుడు వెంకటేష్​తో పాటు మరో నిందితుడు అనిల్ కలసి స్వర్ణ కుమారిని హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. స్వర్ణ కుమారి వద్ద ఉన్న బంగారు నగల కోసమే వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్య జరిగిన మరుసటిరోజే వెంకటేష్ స్వర్ణ కుమార్​కి చెందిన నగలను పట్టణంలోని ఓ బంగారు నగర దుకాణంలో కుదువ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

"బరి తెగించారు" ఆన్​లైన్​లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు

విశాఖలో బైక్ కొట్టేసి తునిలో చైన్ స్నాచింగ్ - "షాకింగ్ విజువల్స్"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.