ETV Bharat / state

గాడిన పడని గ్రామ సచివాలయాల సేవలు

author img

By

Published : Jun 28, 2020, 5:21 PM IST

పాలనలో వికేంద్రీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. సిబ్బందికి సరైన శిక్షణ, వనరుల లేమి, సాంకేతిక సమస్యలు, ప్రారంభమైన వెంటనే కరోనా విజృంభణ తదితర కారణాలతో ఈ వ్యవస్థ ఆశించిన స్థాయిలో సేవలందించలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవస్థ ద్వారా దాదాపు 530 రకాల సేవలను ప్రజలకు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని అనేక సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

obstacles in village secretariats in kadapa district
గాడిన పడని గ్రామ సచివాలయ సేవలు

కడప జిల్లాలో జనవరి 28వ తేదీన సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. వీటిలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు వివిధ విభాగాల్లో కొలువుదీరారు. ప్రతి సచివాలయంలో ప్రజా సేవలతోపాటు స్పందన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాల ద్వారా అందించనున్న 530 రకాల సేవలను స్థానికులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. లభ్యమవుతున్న సేవలను అవసరార్థులు వినియోగించుకునే క్రమంలో సచివాలయాలకు వెళ్లి తమకు ఫలానా ధ్రువపత్రం కావాలని అడిగితే దీనికి సంబంధించిన లాగిన్‌, తదితరాలు తమకు ఇంకా తెలియవంటూ సిబ్బంది చెబుతున్నారు.

చాలామందికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏయే ఫిర్యాదులు తీసుకుంటారు, ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై అవగాహన లేదు. ఫలితంగా చాలామంది నేటికీ మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు. పైగా గ్రామంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో లేదోననే అనుమానంతో పట్టణాల్లోని మీసేవ కేంద్రాలకు వెళుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.

జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 530 రకాల సేవలను నామమాత్రపు రుసుముతో ప్రజలు పొందవచ్చు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 83, రవాణా 61, పురపాలక శాఖకు సంబంధించి 39 సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు 80 శాతం మంది పట్టణాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సుగల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏటా రూ.18,700 నగదును అందిస్తామని ప్రకటించింది. దీంతో అనేకమంది మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో చాలామంది స్థానిక సచివాలయాలకు వెళ్లి కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసేందుకు యత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో చివరికి మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు.

నకళ్లకు ఇబ్బంది..
బద్వేలు మండల పరిధిలోని బేతాయపల్లెలో సచివాలయం ఏర్పాటైంది. ఇందులో వివిధ అవసరాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కాకులూరి లక్ష్మీదేవి అనే మహిళ తెలిపారు. ముఖ్యంగా సంబంధిత పత్రాల నకళ్లు చేయించుకోవటం కుదరటం లేదన్నారు. అందువల్ల పట్టణానికి పనిపై వెళ్లేటప్పుడు అక్కడే ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆదాయ, కుల ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సేవలు పెంచితే మేలు..
గోపవరం మండలంలో మారుమూల సూరేపల్లి. కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం సచివాలయానికి వెళితే అంతర్జాలం పని చేయలేదని మరో మహిళ చెప్పారు. దీంతో పట్టణంలోని మీ-సేవ కేంద్రంలో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. సచివాలయాల్లోనే సేవలను అందిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.

అవగాహన కల్పిస్తాం

'మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు అర్హులైన వారు వారి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మండలానికి 700 దరఖాస్తులు కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం వచ్చాయి. వాటిలో సుమారు 500 వరకు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. దీన్ని బట్టి ప్రజలకు సచివాలయ వ్యవస్థ పనితీరుపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లు కనిపించటం లేదు. ఇకపై అవగాహన కల్పిస్తాం. 530 రకాల సేవలను ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలను అందించాలని భావిస్తోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కొన్ని సేవలను ఉచితంగా, మరి కొన్నింటిని తక్కువ ఖర్చుతో పొందవచ్చు' -సరస్వతి, తహసీల్దారు గోపవరం మండలం

ప్రజలకు చేరువలో సచివాలయాలు

'జిల్లాలో 889 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. వాటికి సంబంధించి తగినంత సిబ్బంది నియామకాలు జరిగాయి. గత సంవత్సరంలోనే సిబ్బందికి నాణ్యమైన శిక్షణతోపాటు, సచివాలయాల్లోకి పనులపై వచ్చే ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, వారికి అందించాల్సిన సేవలపై అవగాహన కల్పించాలని సూచించాం. ముఖ్యంగా సంబంధిత సేవలు పొందేందుకు తీసుకునే సమయంపై దరఖాస్తుదారుకు తెలపాలని చెప్పాం. మీసేవల్లో సేవలున్నా ఖర్చు ఎక్కువే. జిల్లాలోని అనేక సచివాలయాల్లో ప్రజలు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను సకాలంలో పొందుతున్నారు. ఇకపై వార్డు, గ్రామ వాలంటీర్ల సమన్వయంతో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడతాం' -ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

ఇవీ చదవండి..

అంతా అయిపోయాక కొండెక్కిన టమాటా... అల్లాడుతున్న రైతన్న

కడప జిల్లాలో జనవరి 28వ తేదీన సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. వీటిలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు వివిధ విభాగాల్లో కొలువుదీరారు. ప్రతి సచివాలయంలో ప్రజా సేవలతోపాటు స్పందన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాల ద్వారా అందించనున్న 530 రకాల సేవలను స్థానికులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. లభ్యమవుతున్న సేవలను అవసరార్థులు వినియోగించుకునే క్రమంలో సచివాలయాలకు వెళ్లి తమకు ఫలానా ధ్రువపత్రం కావాలని అడిగితే దీనికి సంబంధించిన లాగిన్‌, తదితరాలు తమకు ఇంకా తెలియవంటూ సిబ్బంది చెబుతున్నారు.

చాలామందికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏయే ఫిర్యాదులు తీసుకుంటారు, ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై అవగాహన లేదు. ఫలితంగా చాలామంది నేటికీ మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు. పైగా గ్రామంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో లేదోననే అనుమానంతో పట్టణాల్లోని మీసేవ కేంద్రాలకు వెళుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.

జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 530 రకాల సేవలను నామమాత్రపు రుసుముతో ప్రజలు పొందవచ్చు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 83, రవాణా 61, పురపాలక శాఖకు సంబంధించి 39 సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు 80 శాతం మంది పట్టణాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సుగల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏటా రూ.18,700 నగదును అందిస్తామని ప్రకటించింది. దీంతో అనేకమంది మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో చాలామంది స్థానిక సచివాలయాలకు వెళ్లి కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసేందుకు యత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో చివరికి మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు.

నకళ్లకు ఇబ్బంది..
బద్వేలు మండల పరిధిలోని బేతాయపల్లెలో సచివాలయం ఏర్పాటైంది. ఇందులో వివిధ అవసరాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కాకులూరి లక్ష్మీదేవి అనే మహిళ తెలిపారు. ముఖ్యంగా సంబంధిత పత్రాల నకళ్లు చేయించుకోవటం కుదరటం లేదన్నారు. అందువల్ల పట్టణానికి పనిపై వెళ్లేటప్పుడు అక్కడే ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆదాయ, కుల ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సేవలు పెంచితే మేలు..
గోపవరం మండలంలో మారుమూల సూరేపల్లి. కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం సచివాలయానికి వెళితే అంతర్జాలం పని చేయలేదని మరో మహిళ చెప్పారు. దీంతో పట్టణంలోని మీ-సేవ కేంద్రంలో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. సచివాలయాల్లోనే సేవలను అందిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.

అవగాహన కల్పిస్తాం

'మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు అర్హులైన వారు వారి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మండలానికి 700 దరఖాస్తులు కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం వచ్చాయి. వాటిలో సుమారు 500 వరకు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. దీన్ని బట్టి ప్రజలకు సచివాలయ వ్యవస్థ పనితీరుపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లు కనిపించటం లేదు. ఇకపై అవగాహన కల్పిస్తాం. 530 రకాల సేవలను ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలను అందించాలని భావిస్తోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కొన్ని సేవలను ఉచితంగా, మరి కొన్నింటిని తక్కువ ఖర్చుతో పొందవచ్చు' -సరస్వతి, తహసీల్దారు గోపవరం మండలం

ప్రజలకు చేరువలో సచివాలయాలు

'జిల్లాలో 889 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. వాటికి సంబంధించి తగినంత సిబ్బంది నియామకాలు జరిగాయి. గత సంవత్సరంలోనే సిబ్బందికి నాణ్యమైన శిక్షణతోపాటు, సచివాలయాల్లోకి పనులపై వచ్చే ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, వారికి అందించాల్సిన సేవలపై అవగాహన కల్పించాలని సూచించాం. ముఖ్యంగా సంబంధిత సేవలు పొందేందుకు తీసుకునే సమయంపై దరఖాస్తుదారుకు తెలపాలని చెప్పాం. మీసేవల్లో సేవలున్నా ఖర్చు ఎక్కువే. జిల్లాలోని అనేక సచివాలయాల్లో ప్రజలు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను సకాలంలో పొందుతున్నారు. ఇకపై వార్డు, గ్రామ వాలంటీర్ల సమన్వయంతో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడతాం' -ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

ఇవీ చదవండి..

అంతా అయిపోయాక కొండెక్కిన టమాటా... అల్లాడుతున్న రైతన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.