కడప నగరంలోని ఎన్సీసీ 30 వ ఆంధ్రా బెటాలియన్ భవిష్యత్తులో ట్రెక్కింగ్ హబ్గా మారనుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్సీసీ 30 వ బెటాలియన్ ను ఆయన సందర్శించారు. ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. వచ్చే నెల మొదటివారంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బెటాలియన్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: భయంతో టీకాలకు దూరంగా 18వేల ఉద్యోగులు
ఈ బెటాలియన్ లో 50 లక్షల రూపాయలతో చేపట్టే డ్రిల్ స్క్వేర్ కు కల్నల్ భూమి పూజ చేశారు. గతంలో రెండు సార్లు జాతీయ ట్రెక్కింగ్ క్యాంపులు కడపలో నిర్వహించడంపై గంగా సతీష్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా గడచిన ఏడాది పాటు నుంచి ఇక్కడ క్యాంపులు చేపట్టేలదని.. త్వరలోనే మరిన్ని ట్రెక్కింగ్ క్యాంపులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సైతం మంచి ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి