సంక్రాంతి సంబరాలు కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. భోగి, మకర పండగల అనంతరం శుక్రవారం కనుమ పండగను ప్రజలు వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామాలలో వ్యవసాయదారులు, పశుపోషకులు.. పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
సాయంత్రం ఊర్ల శివారులో కాటమరాజు గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అలంకరించిన పశువులను ఆలయ సమీపంలో వేసిన చిట్లా కుప్పల వద్దకు తీసుకొచ్చి కుప్పలకు శాస్త్రోక్తంగా నిప్పంటించారు. కొందరు యువకులు పశువులను పట్టుకొని వాటికి అలంకరించిన డబ్బు నోట్లు తీసుకునేందుకు పోటీ పడ్డారు. చిట్లా కుప్పలలో గుమ్మడి కాయలు, కొబ్బరి చిప్పలు వేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.
ఇదీ చదవండి