ETV Bharat / state

కడపలో సినీఫక్కీలో చోరీ- అన్నీ అనుమానాలే

author img

By

Published : Jan 17, 2020, 7:03 PM IST

50 లక్షలు విలువ చేసే కనకపుష్యరాగాన్ని కొనుగోలు చేస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు... ఖాదర్‌ బాషాపై దాడి చేసి రాయిని అపహరించారు. ఈ ఘటన కడప  రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కనకపుష్యరాగం స్టోన్ అపహరణ
కనకపుష్యరాగం స్టోన్ అపహరణ

కడప నగరంలోని చిలుకలబావికి చెందిన ఖాదర్‌ బాషా... తన వద్ద ఉన్న కనకపుష్య రాగం అమ్మాలనుకున్నాడు. కర్ణాటక చెందిన వజ్రాల వ్యాపారి, ఇంకో వ్యక్తితో ఆదిత్య లాడ్జిలో బేరాన్ని కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి ఆ స్టోన్​ లాగేసుకున్నారు. తర్వాత స్నానాల గదిలో బంధించారు. కొన్ని గంటల తర్వాత కట్లు విప్పుకున్నబాధితుడు... పోలీసులకు సమాచారమిచ్చాడు. గాయాలపాలైన ఖాదర్‌ బాషాను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కనకపుష్యరాగం స్టోన్ అపహరణ

కడప నగరంలోని చిలుకలబావికి చెందిన ఖాదర్‌ బాషా... తన వద్ద ఉన్న కనకపుష్య రాగం అమ్మాలనుకున్నాడు. కర్ణాటక చెందిన వజ్రాల వ్యాపారి, ఇంకో వ్యక్తితో ఆదిత్య లాడ్జిలో బేరాన్ని కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి ఆ స్టోన్​ లాగేసుకున్నారు. తర్వాత స్నానాల గదిలో బంధించారు. కొన్ని గంటల తర్వాత కట్లు విప్పుకున్నబాధితుడు... పోలీసులకు సమాచారమిచ్చాడు. గాయాలపాలైన ఖాదర్‌ బాషాను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కనకపుష్యరాగం స్టోన్ అపహరణ

ఇవీ చదవండి

అశ్లీల చిత్రాలు చూసి నాలుగేళ్ల చిన్నారిపై మైనర్ల అత్యాచారం

Intro:ap_cdp_16_17_stone_apaharana_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.
ఈ జే ఎస్: శివరామ చారి

యాంకర్:
ఎంతో విలువైన కనకపుష్యరాగాన్ని కొనుగోలు చేస్తామని నమ్మించి అపహరించిన ఘటన కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కడప నగరంలోని చిలకల బావి కి చెందిన ఖాదర్ భాషా తన దగ్గర ఉన్న కనకపుష్య రాగాన్ని తన అవసరాల నిమిత్తం అమ్మడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో కర్ణాటకకు చెందిన హుస్సేన్ ఒక వజ్రాల వ్యాపారిని తీసుకువచ్చాడు. వారు కడపలోని ఆదిత్య లాడ్జిలో 205 రూమ్ నెంబర్ లో వుండి ఖాదర్ బాషాను పిలిచారు. అనంతరం హుస్సేన్ వజ్రాల వ్యాపారి ఇంకో వ్యక్తి కలిసి ఖాదర్బాషా ను కట్టేసి బాత్రూంలో పడేసి కనకపుష్యరాగం తో పరారయ్యారు. ఎలాగోలా కట్లు విప్పుకొని బయటికి వచ్చిన ఖాదర్బాషా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఖాదర్ భాషాకు కొన్ని గాయాలు కావడం వల్ల అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాని ఖరీదు బహిరంగ మార్కెట్లో 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
byte: సత్యబాబు, రిమ్స్ సీఐ, కడప.


Body:కనకపుష్యరాగం స్టోన్ అపహరణ


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.