కడప జిల్లా పులివెందులలో సుమారు 100 మంది చీనీ రైతులను మోసం చేసి దాదాపు రూ.3 కోట్లు మేర కుచ్చు టోపీ పెట్టిన నిందితుడు వినయతుల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన వినయతుల్లా పై... స్థానిక రైతులు కడప ఎంపీ అవినాష్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్లో దళారీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు చీనీ రైతులు పోలీస్ స్టేషన్ను వెళ్లి నిందితుడి గురించి ఆరా తీశారు. దీనిపై స్పందించిన అర్బన్ సీఐ సీతారామిరెడ్డి ఈ నెల 18 న కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :