ETV Bharat / state

కడపలో రైతులను మోసం చేసిన దళారీ అరెస్టు...?

కడప జిల్లాలో 100 మంది చీనీ రైతులను మోసం చేసిన దళారీ వినయతుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కడప, పులివెందుల రైతులు గతంలో ఎంపీ అవినాష్​రెడ్డికి దళారీ మోసంపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Sep 28, 2019, 10:32 PM IST

దళారీ అరెస్టు

కడప జిల్లా పులివెందులలో సుమారు 100 మంది చీనీ రైతులను మోసం చేసి దాదాపు రూ.3 కోట్లు మేర కుచ్చు టోపీ పెట్టిన నిందితుడు వినయతుల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన వినయతుల్లా పై... స్థానిక రైతులు కడప ఎంపీ అవినాష్​రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్​లో దళారీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు చీనీ రైతులు పోలీస్ స్టేషన్​ను వెళ్లి నిందితుడి గురించి ఆరా తీశారు. దీనిపై స్పందించిన అర్బన్ సీఐ సీతారామిరెడ్డి ఈ నెల 18 న కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి :

కడప జిల్లా పులివెందులలో సుమారు 100 మంది చీనీ రైతులను మోసం చేసి దాదాపు రూ.3 కోట్లు మేర కుచ్చు టోపీ పెట్టిన నిందితుడు వినయతుల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన వినయతుల్లా పై... స్థానిక రైతులు కడప ఎంపీ అవినాష్​రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్​లో దళారీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు చీనీ రైతులు పోలీస్ స్టేషన్​ను వెళ్లి నిందితుడి గురించి ఆరా తీశారు. దీనిపై స్పందించిన అర్బన్ సీఐ సీతారామిరెడ్డి ఈ నెల 18 న కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి :

'రాయలసీమలో హైకోర్టు... ప్రభుత్వం పరిశీలన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.