ETV Bharat / state

'జోగాపురంలో పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలి'

author img

By

Published : Jun 23, 2020, 7:43 AM IST

గండికోట ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు.

kadapa district
గండికోట ప్రాజెక్ట్ పై కలెక్టర్ సమీక్ష

అక్టోబర్ నెలాఖరులోపు తాళ్ల పొద్దుటూరు వారందరికీ జోగాపురంలో పునరావాస కల్పనకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతం తాళ్లపొద్దుటూరు వారికి పునరావాస కల్పనలో భాగంగా సుగమంచి పల్లి రైతులతో కలెక్టర్ చర్చించారు. ఇప్పటికే 101 ఎకరాలను రైతుల నుంచి సేకరించామని, ఈ భూమిని అభివృద్ధి చేయడానికి, రోడ్లు వేయడానికి టెండర్లు పిలిచామని వివరించారు. పునరావాస కాలనీలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు సూచనలు ఇచ్చారు.

అక్టోబర్ నెలాఖరులోపు తాళ్ల పొద్దుటూరు వారందరికీ జోగాపురంలో పునరావాస కల్పనకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతం తాళ్లపొద్దుటూరు వారికి పునరావాస కల్పనలో భాగంగా సుగమంచి పల్లి రైతులతో కలెక్టర్ చర్చించారు. ఇప్పటికే 101 ఎకరాలను రైతుల నుంచి సేకరించామని, ఈ భూమిని అభివృద్ధి చేయడానికి, రోడ్లు వేయడానికి టెండర్లు పిలిచామని వివరించారు. పునరావాస కాలనీలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు సూచనలు ఇచ్చారు.

ఇది చదవండి 'నేతన్న నేస్తం ఎంపికలో అవకతవకలు జరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.