ETV Bharat / state

నీట్​లో మెరిసిన కడప అమ్మాయి

దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ విద్యార్థిని మెరిసింది. 15లక్షల మందికిపైగా హాజరైన ఈ పరీక్షలో సత్తాచాటి తన ఊరితోపాటు జిల్లా కీర్తిని దశదిశలా చాటింది. 720 మార్కులకు 690 మార్కులు సాధించి జాతీయస్థాయిలో 16వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది.

author img

By

Published : Jun 7, 2019, 2:17 PM IST

అస్రాఖురేషీ

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దస్తగిరిపేటకు చెందిన అస్రా ఖురేషీ.. చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. తన తాత, తండ్రులు వైద్యులు కావాలనుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక కాలేకపోయారు. వారి కోరికను తన లక్ష్యంగా మార్చుకుని ప్రణాళికబద్ధంగా చదువుతూ.. గమ్యం వైపు అడుగులు వేసింది. ఏడో తరగతి వరకూ పొద్దుటూరులో, పదో తరగతి హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. ఆ కళాశాలలోనే బైపీసీలో ఇంటర్ విద్య అభ్యసించి.. ఎంసెట్​లో రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు సాధించింది. అలానే జాతీయస్థాయి పరీక్ష నీట్​లో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. మూడుతరాల కోరికను తన కుమార్తె తీర్చటంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల్లేవు.

అయితే తన లక్ష్యం దిల్లీలోని ఎయిమ్స్​లో వైద్యవిద్య అభ్యసించాలని. దానికోసం చక్కని ప్రణాళికతో సిద్ధమైంది. దానికి సంబంధించిన పరీక్ష రాసింది. వాటి ఫలితాలు జూన్ 12న రానున్నాయి. అలాగే మరో దేశవ్యాప్త ప్రతిష్టాత్మక పరీక్ష జిప్మర్​కు హాజరైంది. ఈనెల 10న వాటి ఫలితాలూ వస్తాయి. వాటిలో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నారు అస్ర.

అస్రా ఖురేషి అక్క ఫర్హా ఖురేషి కూడా చదువుల్లో ముందుంది. ఆమె 2017లో తెలంగాణ లాసెట్ పరీక్షలో 11వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం బీఏ ఎల్​ఎల్​బీ చదువుతోంది. తల్లిదండ్రుల కోరికను తమ లక్ష్యంగా తీసుకుని చదువుల్లో రాణిస్తున్న వీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.

అస్రాఖురేషీ

ఇవీ చదవండి..

25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దస్తగిరిపేటకు చెందిన అస్రా ఖురేషీ.. చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. తన తాత, తండ్రులు వైద్యులు కావాలనుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక కాలేకపోయారు. వారి కోరికను తన లక్ష్యంగా మార్చుకుని ప్రణాళికబద్ధంగా చదువుతూ.. గమ్యం వైపు అడుగులు వేసింది. ఏడో తరగతి వరకూ పొద్దుటూరులో, పదో తరగతి హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. ఆ కళాశాలలోనే బైపీసీలో ఇంటర్ విద్య అభ్యసించి.. ఎంసెట్​లో రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు సాధించింది. అలానే జాతీయస్థాయి పరీక్ష నీట్​లో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. మూడుతరాల కోరికను తన కుమార్తె తీర్చటంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల్లేవు.

అయితే తన లక్ష్యం దిల్లీలోని ఎయిమ్స్​లో వైద్యవిద్య అభ్యసించాలని. దానికోసం చక్కని ప్రణాళికతో సిద్ధమైంది. దానికి సంబంధించిన పరీక్ష రాసింది. వాటి ఫలితాలు జూన్ 12న రానున్నాయి. అలాగే మరో దేశవ్యాప్త ప్రతిష్టాత్మక పరీక్ష జిప్మర్​కు హాజరైంది. ఈనెల 10న వాటి ఫలితాలూ వస్తాయి. వాటిలో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నారు అస్ర.

అస్రా ఖురేషి అక్క ఫర్హా ఖురేషి కూడా చదువుల్లో ముందుంది. ఆమె 2017లో తెలంగాణ లాసెట్ పరీక్షలో 11వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం బీఏ ఎల్​ఎల్​బీ చదువుతోంది. తల్లిదండ్రుల కోరికను తమ లక్ష్యంగా తీసుకుని చదువుల్లో రాణిస్తున్న వీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.

అస్రాఖురేషీ

ఇవీ చదవండి..

25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం

Intro:చలివేంద్ర నిరుపయోగం


Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వేసవితాపాన్ని తీర్చేందుకు మున్సిపల్ అధికారులు 5 చలివేంద్రం ఏర్పాటు చేశారు కానీ ఈ చలివేంద్రాలు నిరుపయోగంగా మారాయి ఎప్పుడు చూసినా కానీ కాలి కుండలు దర్శనమిస్తున్నాయి ప్రభుత్వం వేల రూపాయలు ఖర్చుపెట్టి ఎండాకాలం వేసవి బారినుండి కాపాడేందుకు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ ఇవి మొక్కుబడిగా మారాయి ప్రారంభించిన రెండు రోజులు మాత్రమే నీటిని సరఫరా చేసిన అధికారులు తర్వాత వాటి పరిరక్షణ గాలికొదిలేశారు ఎప్పుడు చూసినా గాని కాళీ కుండలతో దర్శనమిస్తుండడంతో నీటి వచ్చిన ప్రజలు చూసి వేను తిరుగు తున్నారు


Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.