ETV Bharat / state

ప్రాణభయం సాకుతో తుపాకీ లైసెన్స్​.. తర్వాత బెదిరింపులు, భూ దందాలు!

author img

By

Published : Mar 29, 2023, 7:58 AM IST

Gun Firing in Pulivendula: పులివెందుల్లో కాల్పులకు తెగబడ్డ గొర్లె భరత్‌కుమార్‌ యాదవ్‌ అత్యంత వివాదాస్పదుడు. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యక్తికి తుపాకీ లైసెన్సు ఎవరి సిఫార్సుతో ఇచ్చారు? ఆ లైసెన్సుడు తుపాకీతో అతను సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతుంటే పోలీసుల నిఘా ఏమైంది? ఎందుకు లైసెన్సు రద్దుచేయలేదు? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ ముఖ్యనాయకుడి ఒత్తిడితోనే పోలీసులు అతనికి లైసెన్సు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Gun Firing in Pulivendula
Gun Firing in Pulivendula

ప్రాణ భయం సాకుతో తుపాకీ లైసెన్స్​.. తర్వాత బెదిరంపులు, భూ దందాలు!

Firing in Pulivendula: వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్ తెచ్చుకోవడం.. చర్చనీయాంశమైంది. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి.. పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్ ఇచ్చారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసు నుంచే పులివెందుల్లో పేరు తెచ్చుకున్న భరత్ యాదవ్.. తుపాకీ ఉందనే కారణంతో భూ దందాలు, సెటిల్​మెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించడం.. అసాంఘిక శక్తులకు ఆజ్యం పోసినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ ఛానల్ విలేకరిగా.. భరత్ కుమార్ యాదవ్.. ఇతను పులివెందుల పట్టణంలో గతంలో యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పని చేశాడు. పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా.. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత అతని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడటం చేసేవాడు.

వైసీపీ నేతలకు దగ్గరగా.. 2021 మార్చిలో వివేకా కేసులో నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు దిల్లీకి విచారణకు పిలిచారు. ఆ సమయంలోనే మరో నిందితుడు శివశంకర్ రెడ్డి సూచనల మేరకు భరత్ యాదవ్ దిల్లీ వెళ్లాడు. దస్తగిరితో వారం రోజులు ఉన్నాడు. దస్తగిరిని సీబీఐ ప్రశ్నించే విషయాలను తెలుసుకుని శివశంకర్ రెడ్డికి చేరవేయడం భరత్ కుమార్ యాదవ్ పని. దిల్లీ నుంచి దస్తగిరి తిరిగి వచ్చిన తర్వాత.. అతన్ని మరోసారి భరత్ యాదవ్ కలిసి వైసీపీ ముఖ్యనేతల పేర్లు చెప్పవద్దని.. నీకేంకావాలన్నా వారు చూసుకుంటారని బెదిరించినట్లు దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు పలుమార్లు భరత్ యాదవ్‌ను కడపకు పిలిపించి అతని వాంగ్మూలం నమోదు చేశారు. ఏ-2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌కు సమీప బంధువైన భరత్ యాదవ్.. తర్వాత సీబీఐ అధికారులపై ఆరోపణలు చేశారు. సీబీఐ అఫిడవిట్లపై పులివెందులలో భరత్ యాదవ్ స్పందించి మాట్లాడేవాడు. ఇలా పులివెందులలోని వైసీపీ ముఖ్య నేతలకు భరత్ యాదవ్ దగ్గరయ్యాడు.

తుపాకీతో బెదిరింపులు, భూ దందాలు.. వివేకా కేసు విచారణ అంశాన్ని సాకుగా చూసి తుపాకీ లైసెన్స్ కావాలని గత ఏడాది పోలీసులకు దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తిరస్కరించారు. కానీ వైసీపీ ముఖ్యనేతల అండ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగం.. భరత్ యాదవ్‌కు తుపాకీ లైసెన్స్ ఇచ్చిందనేది బహిరంగ రహస్యమే. ఇదే తుపాకీతోనే ఏడాది నుంచి పులివెందుల చుట్టు పక్కల ప్రాంతాల్లో భరత్ యాదవ్ భూ దందాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో తన తాతలు అమ్మిన భూములు, ఇళ్ల స్థలాలను ఇప్పుడు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 2 నెలల కిందట తన టిఫిన్ సెంటర్ పక్కన ప్రహరీ గోడ విషయంలో తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని భరత్ యాదవ్ తుపాకీతో బెదిరించాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినా.. మిన్నకుండి పోయారు.

మూడు రౌండ్లు కాల్పులు.. వైసీపీ నేతల అండ ఉండటంతోనే భరత్ యాదవ్.. భూ దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళవారం దిలీప్, మహబూబ్ బాషాలపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపడం.. వారిలో దిలీప్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పులివెందుల ప్రాంతంలో మట్కా జూదాన్ని భరత్ నడుపుతున్నట్లు తెలిసింది. 2నెలల క్రితం తుపాకీతో బెదిరించినపుడే పోలీసులు కట్టడి చేసి ఉంటే ఇలా జరిగేది కాదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మేల్సీ ఎన్నికల సమయంలోనూ భరత్ యాదవ్ తుపాకీని.. పోలీసులు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల పట్టణంలో భరత్ యాదవ్ లాంటి వ్యక్తులు ఇంకాఎవరెవరికి పోలీసులు.. తుపాకీ లైసెన్సులు ఇచ్చారనేది తేలాల్సి ఉంది. మంగళవారం జరిగిన కాల్పుల ఘటనతో పులివెందుల వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు: భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ..
అనేక అరాచకాలకు కేంద్రబిందువుగా ఉన్న భరత్‌కుమార్‌ యాదవ్‌కు తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? లైసెన్సు ఇవ్వొద్దని జిల్లా యంత్రాంగానికి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు నివేదించినా ఎందుకు పట్టించుకోలేదు? దీనిపై దర్యాప్తు జరగాలి. ఈ వ్యవహారంలో పులివెందుల సీఐ రాజు పాత్రపై విచారణ జరపాలి. భరత్‌యాదవ్‌ ఇటీవల ఈ తుపాకీతో హత్యాయత్నానికి తెగబడినా ఎందుకు లైసెన్సు రద్దుచేయలేదు? ఎమ్మెల్సీగా ఎన్నికైన నాకు అధికారపక్షం నుంచి ముప్పు ఉన్నా.. భద్రత కల్పించలేదు.

సాక్షుల రక్షణ పథకం ప్రకారమే లైసెన్సు: ఎస్పీ అన్బురాజన్‌..
వివేకా హత్య కేసులో భరత్‌కుమార్‌ యాదవ్‌ సాక్షి. తన ప్రాణాలకు హాని ఉందంటూ ఆయన 2021 నవంబరులో సీబీఐ అధికారులకు, మాకు లేఖ రాశారు. దీంతో సాక్షుల రక్షణ పథకం కింద తుపాకీ లైసెన్సు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశాం. భరత్‌కుమార్‌ యాదవ్‌ ఒక్కరికే కాదు.. ఈ కేసులో కీలకమైన సాక్షులందరికీ రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నాం. లైసెన్సుడు తుపాకీతో సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు మాకు ఫిర్యాదులేవీ అందలేదు. అతని బాధితులు ఉంటే మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 26నే అతని వద్దనున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికలు ముగియటంతో ఈ నెల 24న మళ్లీ దాన్ని తిరిగి ఇచ్చాం.

ఇవీ చదవండి:

ప్రాణ భయం సాకుతో తుపాకీ లైసెన్స్​.. తర్వాత బెదిరంపులు, భూ దందాలు!

Firing in Pulivendula: వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్ తెచ్చుకోవడం.. చర్చనీయాంశమైంది. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి.. పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్ ఇచ్చారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసు నుంచే పులివెందుల్లో పేరు తెచ్చుకున్న భరత్ యాదవ్.. తుపాకీ ఉందనే కారణంతో భూ దందాలు, సెటిల్​మెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించడం.. అసాంఘిక శక్తులకు ఆజ్యం పోసినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ ఛానల్ విలేకరిగా.. భరత్ కుమార్ యాదవ్.. ఇతను పులివెందుల పట్టణంలో గతంలో యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పని చేశాడు. పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా.. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత అతని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడటం చేసేవాడు.

వైసీపీ నేతలకు దగ్గరగా.. 2021 మార్చిలో వివేకా కేసులో నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు దిల్లీకి విచారణకు పిలిచారు. ఆ సమయంలోనే మరో నిందితుడు శివశంకర్ రెడ్డి సూచనల మేరకు భరత్ యాదవ్ దిల్లీ వెళ్లాడు. దస్తగిరితో వారం రోజులు ఉన్నాడు. దస్తగిరిని సీబీఐ ప్రశ్నించే విషయాలను తెలుసుకుని శివశంకర్ రెడ్డికి చేరవేయడం భరత్ కుమార్ యాదవ్ పని. దిల్లీ నుంచి దస్తగిరి తిరిగి వచ్చిన తర్వాత.. అతన్ని మరోసారి భరత్ యాదవ్ కలిసి వైసీపీ ముఖ్యనేతల పేర్లు చెప్పవద్దని.. నీకేంకావాలన్నా వారు చూసుకుంటారని బెదిరించినట్లు దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు పలుమార్లు భరత్ యాదవ్‌ను కడపకు పిలిపించి అతని వాంగ్మూలం నమోదు చేశారు. ఏ-2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌కు సమీప బంధువైన భరత్ యాదవ్.. తర్వాత సీబీఐ అధికారులపై ఆరోపణలు చేశారు. సీబీఐ అఫిడవిట్లపై పులివెందులలో భరత్ యాదవ్ స్పందించి మాట్లాడేవాడు. ఇలా పులివెందులలోని వైసీపీ ముఖ్య నేతలకు భరత్ యాదవ్ దగ్గరయ్యాడు.

తుపాకీతో బెదిరింపులు, భూ దందాలు.. వివేకా కేసు విచారణ అంశాన్ని సాకుగా చూసి తుపాకీ లైసెన్స్ కావాలని గత ఏడాది పోలీసులకు దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తిరస్కరించారు. కానీ వైసీపీ ముఖ్యనేతల అండ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగం.. భరత్ యాదవ్‌కు తుపాకీ లైసెన్స్ ఇచ్చిందనేది బహిరంగ రహస్యమే. ఇదే తుపాకీతోనే ఏడాది నుంచి పులివెందుల చుట్టు పక్కల ప్రాంతాల్లో భరత్ యాదవ్ భూ దందాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో తన తాతలు అమ్మిన భూములు, ఇళ్ల స్థలాలను ఇప్పుడు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 2 నెలల కిందట తన టిఫిన్ సెంటర్ పక్కన ప్రహరీ గోడ విషయంలో తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని భరత్ యాదవ్ తుపాకీతో బెదిరించాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినా.. మిన్నకుండి పోయారు.

మూడు రౌండ్లు కాల్పులు.. వైసీపీ నేతల అండ ఉండటంతోనే భరత్ యాదవ్.. భూ దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళవారం దిలీప్, మహబూబ్ బాషాలపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపడం.. వారిలో దిలీప్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పులివెందుల ప్రాంతంలో మట్కా జూదాన్ని భరత్ నడుపుతున్నట్లు తెలిసింది. 2నెలల క్రితం తుపాకీతో బెదిరించినపుడే పోలీసులు కట్టడి చేసి ఉంటే ఇలా జరిగేది కాదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మేల్సీ ఎన్నికల సమయంలోనూ భరత్ యాదవ్ తుపాకీని.. పోలీసులు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల పట్టణంలో భరత్ యాదవ్ లాంటి వ్యక్తులు ఇంకాఎవరెవరికి పోలీసులు.. తుపాకీ లైసెన్సులు ఇచ్చారనేది తేలాల్సి ఉంది. మంగళవారం జరిగిన కాల్పుల ఘటనతో పులివెందుల వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు: భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ..
అనేక అరాచకాలకు కేంద్రబిందువుగా ఉన్న భరత్‌కుమార్‌ యాదవ్‌కు తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? లైసెన్సు ఇవ్వొద్దని జిల్లా యంత్రాంగానికి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు నివేదించినా ఎందుకు పట్టించుకోలేదు? దీనిపై దర్యాప్తు జరగాలి. ఈ వ్యవహారంలో పులివెందుల సీఐ రాజు పాత్రపై విచారణ జరపాలి. భరత్‌యాదవ్‌ ఇటీవల ఈ తుపాకీతో హత్యాయత్నానికి తెగబడినా ఎందుకు లైసెన్సు రద్దుచేయలేదు? ఎమ్మెల్సీగా ఎన్నికైన నాకు అధికారపక్షం నుంచి ముప్పు ఉన్నా.. భద్రత కల్పించలేదు.

సాక్షుల రక్షణ పథకం ప్రకారమే లైసెన్సు: ఎస్పీ అన్బురాజన్‌..
వివేకా హత్య కేసులో భరత్‌కుమార్‌ యాదవ్‌ సాక్షి. తన ప్రాణాలకు హాని ఉందంటూ ఆయన 2021 నవంబరులో సీబీఐ అధికారులకు, మాకు లేఖ రాశారు. దీంతో సాక్షుల రక్షణ పథకం కింద తుపాకీ లైసెన్సు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశాం. భరత్‌కుమార్‌ యాదవ్‌ ఒక్కరికే కాదు.. ఈ కేసులో కీలకమైన సాక్షులందరికీ రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నాం. లైసెన్సుడు తుపాకీతో సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు మాకు ఫిర్యాదులేవీ అందలేదు. అతని బాధితులు ఉంటే మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 26నే అతని వద్దనున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికలు ముగియటంతో ఈ నెల 24న మళ్లీ దాన్ని తిరిగి ఇచ్చాం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.