ETV Bharat / state

'పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి'

author img

By

Published : Feb 22, 2021, 4:56 PM IST

కడపలో అఖిలపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరాయి. నేతలు నగరపాలక కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. కొత్త పన్నులను రద్దు చేయకుంటే ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు.

All parties met
పన్నుల పెంపు

పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కడపలో అఖిల పక్ష పార్టీల నాయకులు కోరారు. ప్రజలపై వేసే అయిదు రకాల పన్నులను రద్దు చేయాలని నగర పాలక కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికితోడు మురుగు, లైటింగ్ పన్నుతో 5రకాల పన్నులు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కొత్త పన్నులు వేయడం సరికాదని పేర్కొన్నారు. కొత్త పన్నులను రద్దు చేయకుంటే ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు.

పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కడపలో అఖిల పక్ష పార్టీల నాయకులు కోరారు. ప్రజలపై వేసే అయిదు రకాల పన్నులను రద్దు చేయాలని నగర పాలక కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికితోడు మురుగు, లైటింగ్ పన్నుతో 5రకాల పన్నులు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కొత్త పన్నులు వేయడం సరికాదని పేర్కొన్నారు. కొత్త పన్నులను రద్దు చేయకుంటే ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.