ETV Bharat / state

రెండురోజులుకు పైగా చెట్లపైనే...

author img

By

Published : Nov 29, 2020, 3:27 PM IST

50 గంటలు.. 50 కుటుంబాలు.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నీటి మధ్యే గడిపారు. చుట్టూ నీరు... బయటికి వచ్చే ఆస్కారం లేదు. ఇక ప్రాణాలు పోతాయి అనుకున్న సమయంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది దేవుడిలా వచ్చి ఆ కుటుంబాలను కాపాడిన ఘటన కడప జిల్లా గుర్రంగుంపు తండాలో జరిగింది.

50families were strucked in flood water at gurapugumpu tanda in kadapa
రెండురోజులుకు పైగా చెట్లపైనే... ప్రాణాలు అరచేతిలోనే

కడప శివారులోని గుర్రంగుంపు తండాలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో బుగ్గవంక డ్యాం నిండటంతో... అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఒకేసారి నీరు లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టడంతో స్థానికులు చెట్లపైకి ఎక్కి, ఇతర ప్రదేశాల్లోని నివాసాల్లో తలదాచుకున్నారు. రెండు రోజుల తర్వాత విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది బోట్ల సహాయంతో వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. బాధితులందరినీ బోట్లలో ఒడ్డుకు చేర్చారు. చనిపోతామనుకున్న తమను ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చటంతో... స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

కడప శివారులోని గుర్రంగుంపు తండాలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో బుగ్గవంక డ్యాం నిండటంతో... అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఒకేసారి నీరు లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టడంతో స్థానికులు చెట్లపైకి ఎక్కి, ఇతర ప్రదేశాల్లోని నివాసాల్లో తలదాచుకున్నారు. రెండు రోజుల తర్వాత విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది బోట్ల సహాయంతో వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. బాధితులందరినీ బోట్లలో ఒడ్డుకు చేర్చారు. చనిపోతామనుకున్న తమను ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చటంతో... స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

'వరదలకు దెబ్బతిన్న మార్గాలకు సత్వర మరమ్మతులు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.