ETV Bharat / state

ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన వైకాపా ఎమ్మెల్యే - west godavari dst ycp mla ramjan news

రంజాన్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాద్వారకా తిరుమల మండలంలో ఎమ్మెల్యే తలారి వెంకటరావు ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తెలిపారు.

ycp mla venkatrao distributes ramjan thopha to muslims in west godavari dst
ycp mla venkatrao distributes ramjan thopha to muslims in west godavari dst
author img

By

Published : May 26, 2020, 12:20 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో ఈద్గా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రారంభించారు. రంజాన్ వేడుకలు పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.

ద్వారకాతిరుమలలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తలారి వెంకట్రావు అన్నారు . దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి సుమారు రూ. 32 కోట్లు ,గోపాలపురంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో ఈద్గా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రారంభించారు. రంజాన్ వేడుకలు పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.

ద్వారకాతిరుమలలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తలారి వెంకట్రావు అన్నారు . దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి సుమారు రూ. 32 కోట్లు ,గోపాలపురంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

ఇదీ చూడండి

సచివాలయం గోడకు కన్నం వేసి చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.