పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని 3 గ్రామాల పేద ప్రజలకు ఓఎన్జీసీ సంస్థ... నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు.
విప్పర్రు, అయినపర్రు కాకిలేరు గ్రామాల్లో 1000 కుటుంబాలకు వస్తువులు, కూరగాయలు అందజేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి: