ETV Bharat / state

"రివర్స్ టెండరింగ్​"పై నవయుగ కేసు.. మధ్యాహ్నానికి వాయిదా

రివర్స్​ టెండరింగ్ విధానంతో పోలవరం పనుల ఒప్పందాన్ని రద్దు చేయడంపై నవయుగ సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాల్సిందిగా ఆదేశించాలని కోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్డు మ.2.15 గంటలకు వాయిదా వేసింది.

author img

By

Published : Aug 20, 2019, 12:01 AM IST

Updated : Aug 20, 2019, 11:14 AM IST

పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో వ్యాజ్యం
పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో వ్యాజ్యం
పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో వ్యాజ్యం

పోలవరం హైడ్రో ఎలక్టిక్ ప్రాజెక్టు (పీఈపీ) పనుల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్ ఏ.రమేశ్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆగస్టు 14న ఏపీ జెన్​కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. 80 మెగావాట్ల సామర్థ్యం గల 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటుకోసం ఏపీ జెన్​కోతో...2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నామని నవయుగ కోర్టుకు తెలిపింది. కాగా.. జడ్డి కేసును.. మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.

ఒప్పందం ఇలా

ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ. 5,220.28 కోట్లు కాగా ఒప్పందం ప్రకారం అప్పగింత తేదీ నుంచి మొదటి మూడు యూనిట్లను 40 నెలల్లో పూర్తి చేయాలి. మిగిలిన తొమ్మిది యూనిట్లను రెండు నెలలకు ఒకటి చొప్పున మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఈ దిశగా... ఒప్పంద తేదీ నుంచి తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా పనులు పూర్తి చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వ్యాజ్యంలో పేర్కొన్నారు. టర్బైన్ నమూనా పరీక్షను జయవంతగా పూర్తి చేశామన్నారు.

ఏకపక్షంగా రద్దు!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జులై 1న పునఃసమీక్ష నిర్వహించి.. కాంట్రాక్టును రద్దు చేయాలని ఏపక్షంగా నిర్ణయించారని కోర్టుకు తెలిపింది. ఒప్పంద రద్దుకు కారణాలు పేర్కొనలేదని న్యాయస్థానానికి వెల్లడించింది. ఒప్పందాన్ని రద్దు చేస్తే తమ సంస్థకు భారీగా నష్టం వస్తోందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలో తీసుకొని ఒప్పందం రద్దును... రద్దు చేయాల్సిందిగా కోరారు. కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు తమను అనుమతించాల్సిందిగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం

పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో వ్యాజ్యం
పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో వ్యాజ్యం

పోలవరం హైడ్రో ఎలక్టిక్ ప్రాజెక్టు (పీఈపీ) పనుల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్ ఏ.రమేశ్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆగస్టు 14న ఏపీ జెన్​కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. 80 మెగావాట్ల సామర్థ్యం గల 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటుకోసం ఏపీ జెన్​కోతో...2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నామని నవయుగ కోర్టుకు తెలిపింది. కాగా.. జడ్డి కేసును.. మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.

ఒప్పందం ఇలా

ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ. 5,220.28 కోట్లు కాగా ఒప్పందం ప్రకారం అప్పగింత తేదీ నుంచి మొదటి మూడు యూనిట్లను 40 నెలల్లో పూర్తి చేయాలి. మిగిలిన తొమ్మిది యూనిట్లను రెండు నెలలకు ఒకటి చొప్పున మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఈ దిశగా... ఒప్పంద తేదీ నుంచి తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా పనులు పూర్తి చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వ్యాజ్యంలో పేర్కొన్నారు. టర్బైన్ నమూనా పరీక్షను జయవంతగా పూర్తి చేశామన్నారు.

ఏకపక్షంగా రద్దు!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జులై 1న పునఃసమీక్ష నిర్వహించి.. కాంట్రాక్టును రద్దు చేయాలని ఏపక్షంగా నిర్ణయించారని కోర్టుకు తెలిపింది. ఒప్పంద రద్దుకు కారణాలు పేర్కొనలేదని న్యాయస్థానానికి వెల్లడించింది. ఒప్పందాన్ని రద్దు చేస్తే తమ సంస్థకు భారీగా నష్టం వస్తోందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలో తీసుకొని ఒప్పందం రద్దును... రద్దు చేయాల్సిందిగా కోరారు. కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు తమను అనుమతించాల్సిందిగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం

Intro:ap_gnt_82_19_kodela_pressmeet_avb_ap10170

మాజీ స్పీకర్ కు రక్షణ లేదు. కోడెల.

రాష్ట్రంలో మాజీ స్పీకర్ కు రక్షణ లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల అన్నారు. తెదేపా కార్యాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట లో తన స్వగృహం వద్ద వైసీపీ కి చెందిన వ్యక్తి పాత కేబుల్ వైర్లు కలిగిన ట్రక్కు తీసుకు వచ్చి అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడన్నారు. తమ కార్యకర్తలు ఆ ట్రక్కును తోలగించి గేటుకు తాళమేస్తే ఆవ్యక్తి తిరిగి వచ్చి తమ సెక్యూరిటీ, కార్యకర్తలను దుర్భాశలాడి మరలా ఆట్రక్కును తమ గుమ్మం వద్ద నిలిపి వెళ్లాడని తెలిపారు. విషయం తెలిసిన తాను నరసరావుపేట డిఎస్పీ కి ఫోన్ చేసి సమాచారమిస్తే కార్యాలయానికి వచ్చి పిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారని తెలిపారు. ఇది ఎంతవరకు సబబు అని కోడెల ప్రశ్నించారు. మాజీ సభాపతినైన నాకే రక్షణ కల్పించలేని పోలీస్ వ్యవస్థ సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


Body:రక్షణ భటుల వ్యవస్థ పూర్తిగా వైసీపీ చేతులలో నడుస్తోందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం అక్రమాలు, దాడులు, దౌర్జన్యాల బాటలో రాష్ట్రాన్ని నడుపుతోందన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల పై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తే తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందని వైసీపీ ఆలోచిస్తుందన్నారు. ఇటువంటి చర్యలకు భయపడేది లేదని కోడెల తెలిపారు.


Conclusion:ఇకనైనా పోలీసులు వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. ఉద్యమబాట అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా నాయకుల దృష్టికి తీసువెళ్లి ఉద్యమబాటకు వెళతామని కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు.

బైట్: కోడెల శివప్రసాదరావు, మాజీ సభాపతి.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052
Last Updated : Aug 20, 2019, 11:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.