ETV Bharat / state

మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ

భీమడోలులో మంత్రి కాన్వాయ్ ఢీకొట్టిన ఘటనలో భీమవరానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటరామయ్య మృతి చెందారు. అయితే ఆ కుటుంబాన్ని శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు.

author img

By

Published : Jan 19, 2020, 3:00 PM IST

minister taneti vanitha
మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ
మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ

సంక్రాంతి రోజున మంత్రి కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన వెంకటరామయ్య కుటుంబాన్ని శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో భీమవరానికి చెందిన కాళ్ళకూరి వెంకటరామయ్య మృతి చెందారు. వెంకటరామయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ద్వారకాతిరుమల వెళుతుండగా భీమడోలులో ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భీమవరంలో ఆయన కుటుంబాన్ని తానేటి వనిత పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి...రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ

సంక్రాంతి రోజున మంత్రి కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన వెంకటరామయ్య కుటుంబాన్ని శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో భీమవరానికి చెందిన కాళ్ళకూరి వెంకటరామయ్య మృతి చెందారు. వెంకటరామయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ద్వారకాతిరుమల వెళుతుండగా భీమడోలులో ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భీమవరంలో ఆయన కుటుంబాన్ని తానేటి వనిత పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి...రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.