పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో 207పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం పదిరోజుల వ్యవధిలోనే జిల్లాలో 15వందల కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,233కు చేరుకోగా.. ఇందులో 1053మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 1,148 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజూ భారీగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో 202 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
![పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు Corona cases registered at record level in West Godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8036713-304-8036713-1594812920327.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో 207పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం పదిరోజుల వ్యవధిలోనే జిల్లాలో 15వందల కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,233కు చేరుకోగా.. ఇందులో 1053మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 1,148 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు.
ఇదీచదవండి.