ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో మనోళ్లు మళ్లీ సత్తా చాటారు

author img

By

Published : Oct 5, 2020, 8:05 PM IST

Updated : Oct 5, 2020, 10:54 PM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. కడప జిల్లాకు చెందిన గంగుల భువన్‌రెడ్డి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో విజయనగరం విద్యార్థి ఎల్.జితేంద్ర ప్రథమ ర్యాంక్‌ సాధించారు. దివ్యాంగుల కేటగిరిలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఓపెన్ కేటగిరిలో తెలుగు విద్యార్థులు సుమారు 15మంది వందలోపు ర్యాంకులు సాధించారు. 500లోపు దాదాపు 60 మంది జయకేతనం ఎగరవేశారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దేశవ్యాప్తంగా 43 వేల 204 మంది అర్హత సాధించారు. బాలురు 36 వేల 497 మందికాగా.. బాలికలు 6 వేల 707 మంది.. దివ్యాంగులు 436 అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 13 వేల 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ ఫాలర్ 396 మార్కుల్లో 352 సాధించి.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బాలికల విభాగంలో కనిష్క మిత్తల్ 315 మార్కులతో అగ్రస్థానం సాధించింది. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. లక్షా 50 వేల 838 మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. కడప జిల్లా బుడ్డాయిపల్లెకు చెందిన గంగుల భువన్‌రెడ్డి జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో విజయనగరం విద్యార్థి ఎల్.జితేంద్ర తొలి ర్యాంక్‌ సాధించగా..దివ్యాంగుల కేటగిరిలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్.. మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కుమార్ సత్యం 22వ ర్యాంకు సాధించగా.. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి జాతీయ స్థాయిలో... 32వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. విజయవాడ విద్యార్థి చిలుకూరి మణి ప్రణీత్‌కు.. ఓబీసీ విభాగంలో రెండు, జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాల విద్యార్థి అన్నం సాయివర్దన్... ఓబీసీ విభాగంలో 7, జాతీయ స్థాయిలో 93వ ర్యాంకు సాధించాడు.

ఏలూరుకు చెందిన యశ్వంత్​ సాయితో ముఖాముఖి

గుంటూరు కృష్ణానగర్ కు చెందిన కొర్రపాటి వెంకట శేష హరిచరణ్ ఓపెన్ కేటగిరీలో 153 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారణాసి సిద్ధార్థ జాతీయ స్థాయిలో 229 కైవసం చేసుకోగా.. నరసన్నపేటకు చెందిన వడ్డీ ఆదిత్య జాతీయ స్థాయిలో 810వ ర్యాంకు సాధించాడు. విశాఖ జిల్లా ఆర్లి గ్రామీణ ప్రాంతానికి చెందిన బోలెం వెంకటసాయి సూర్య విద్యా చరణ్ 463వ ర్యాంక్ సాధించాడు. ఈసారి ఓపెన్ కేటగిరిలో తెలుగు విద్యార్థులు.... సుమారు 15మంది వందలోపు ర్యాంకులు సాధించగా... 500ల ర్యాంకులోపు 60మంది సత్తాచాటారు.

గుంటూరుకు చెందిన హరిచరణ్​తో ముఖాముఖి..

ఐఐటీ, ఎన్​ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 17న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.

ఇదీ చదవండి: చదువు కోసం సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూసూద్

ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దేశవ్యాప్తంగా 43 వేల 204 మంది అర్హత సాధించారు. బాలురు 36 వేల 497 మందికాగా.. బాలికలు 6 వేల 707 మంది.. దివ్యాంగులు 436 అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 13 వేల 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ ఫాలర్ 396 మార్కుల్లో 352 సాధించి.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బాలికల విభాగంలో కనిష్క మిత్తల్ 315 మార్కులతో అగ్రస్థానం సాధించింది. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. లక్షా 50 వేల 838 మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. కడప జిల్లా బుడ్డాయిపల్లెకు చెందిన గంగుల భువన్‌రెడ్డి జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో విజయనగరం విద్యార్థి ఎల్.జితేంద్ర తొలి ర్యాంక్‌ సాధించగా..దివ్యాంగుల కేటగిరిలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్.. మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కుమార్ సత్యం 22వ ర్యాంకు సాధించగా.. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి జాతీయ స్థాయిలో... 32వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. విజయవాడ విద్యార్థి చిలుకూరి మణి ప్రణీత్‌కు.. ఓబీసీ విభాగంలో రెండు, జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాల విద్యార్థి అన్నం సాయివర్దన్... ఓబీసీ విభాగంలో 7, జాతీయ స్థాయిలో 93వ ర్యాంకు సాధించాడు.

ఏలూరుకు చెందిన యశ్వంత్​ సాయితో ముఖాముఖి

గుంటూరు కృష్ణానగర్ కు చెందిన కొర్రపాటి వెంకట శేష హరిచరణ్ ఓపెన్ కేటగిరీలో 153 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారణాసి సిద్ధార్థ జాతీయ స్థాయిలో 229 కైవసం చేసుకోగా.. నరసన్నపేటకు చెందిన వడ్డీ ఆదిత్య జాతీయ స్థాయిలో 810వ ర్యాంకు సాధించాడు. విశాఖ జిల్లా ఆర్లి గ్రామీణ ప్రాంతానికి చెందిన బోలెం వెంకటసాయి సూర్య విద్యా చరణ్ 463వ ర్యాంక్ సాధించాడు. ఈసారి ఓపెన్ కేటగిరిలో తెలుగు విద్యార్థులు.... సుమారు 15మంది వందలోపు ర్యాంకులు సాధించగా... 500ల ర్యాంకులోపు 60మంది సత్తాచాటారు.

గుంటూరుకు చెందిన హరిచరణ్​తో ముఖాముఖి..

ఐఐటీ, ఎన్​ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 17న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.

ఇదీ చదవండి: చదువు కోసం సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Last Updated : Oct 5, 2020, 10:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.