ETV Bharat / state

'జగనన్నా ఆలోచించు... గంటా మనకొద్దు'

author img

By

Published : Aug 6, 2020, 5:34 PM IST

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గంటాను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ విశాఖ జిల్లాలోని వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. గంటాను పార్టీలోకి తీసుకోవద్దంటూ సీఎం జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ycp leaders protest against ganta
ycp leaders protest against ganta

వైకాపా కార్యకర్తల ఆందోళన

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైకాపాలో చేర్చుకుంటే సహించేదిలేదంటూ విశాఖ జిల్లాలోని భీమునిపట్నం, తగరపువలస వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. విశాఖ జిల్లా తగరపువలస అంబేడ్కర్ జంక్షన్​లో గంటా ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంలా నిల్చొన్నారు.

తెదేపా హయాంలో వైకాపా నాయకులు, కార్యకర్తలను గంటా ఎన్నో ఇబ్బందులు పెట్టారని భీమునిపట్నం, తగరపువలసకు చెందిన వైకాపా కార్యకర్తలు ఆరోపించారు. పద్మనాభం మండలం చిన్నాపురంలో రాత్రికి రాత్రి వైఎస్సార్ విగ్రహాన్ని 200 మంది పోలీసులు బందోబస్తుతో తీసివేయించారని అన్నారు. అవినీతి, అక్లమాలు, భూకబ్జాలకు గంటా కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. గంటాను పార్టీలోకి తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. అధిష్ఠానం గంటా చేరిక విషయంలో పునరాలోచించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.

గంటాను పార్టీలోకి తీసుకోవద్దంటూ విశాఖ జీవీఎంసీ 5,6,7,8 వార్డులకు చెందిన నాయకులు పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి: బొత్స

వైకాపా కార్యకర్తల ఆందోళన

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైకాపాలో చేర్చుకుంటే సహించేదిలేదంటూ విశాఖ జిల్లాలోని భీమునిపట్నం, తగరపువలస వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. విశాఖ జిల్లా తగరపువలస అంబేడ్కర్ జంక్షన్​లో గంటా ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంలా నిల్చొన్నారు.

తెదేపా హయాంలో వైకాపా నాయకులు, కార్యకర్తలను గంటా ఎన్నో ఇబ్బందులు పెట్టారని భీమునిపట్నం, తగరపువలసకు చెందిన వైకాపా కార్యకర్తలు ఆరోపించారు. పద్మనాభం మండలం చిన్నాపురంలో రాత్రికి రాత్రి వైఎస్సార్ విగ్రహాన్ని 200 మంది పోలీసులు బందోబస్తుతో తీసివేయించారని అన్నారు. అవినీతి, అక్లమాలు, భూకబ్జాలకు గంటా కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. గంటాను పార్టీలోకి తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. అధిష్ఠానం గంటా చేరిక విషయంలో పునరాలోచించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.

గంటాను పార్టీలోకి తీసుకోవద్దంటూ విశాఖ జీవీఎంసీ 5,6,7,8 వార్డులకు చెందిన నాయకులు పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.