అల్పపీడన ద్రోణి కారణంగా విశాఖ మన్యంలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. మన్యంలో ముంచంగిపుట్టుతో పాటు ఒనకడిల్లి, మాచ్ ఖండ్, జోలాపుట్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. డుడుమ జలాశయం నుంచి 600 క్యూసెక్కుల వరద నీటిని దిగువున బలిమెలకు విడుదల చేశారు.
ఇదీ చూడండి: కోణం జలాశయంలో పెరిగిన నీటిమట్టం