విశాఖపట్నం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. 2 వేల 590 అడుగుల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 2 వేల 589.80 అడుగులకు చేరింది. ఫలితంగా జలాశయానికి చెందిన 8వ నంబర్ గేటు ఒక అడుగు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీచదవండి.