విశాఖ కలెక్టరేట్ వద్ద వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనబాట పట్టారు. మున్సిపల్ అధికారులు.. వార్డు సచివాలయ, పర్యావరణ కార్యదర్శులకు సంబంధంలేని ఉద్యోగ బాధ్యతలు అప్పగించి బలవంతంగా చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. పని భారంతో సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
ఇదీ చదవండి..
Mansas Trust Case: హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తాం: మంత్రి వెల్లంపల్లి