ETV Bharat / state

ప్రశ్నించినందుకే గిరిజనులను హత్య చేశారు: విశాఖ ఎస్పీ

విశాఖ ఏజెన్సీలో ఇద్దరు గిరిజనులను మావోలు చంపడంపై ఎస్పీ బాబూజీ అట్టాడ తప్పు బట్టారు. ప్రశ్నించినందుకే వారిని హత్య చేశారని తెలిపారు.

author img

By

Published : Jul 18, 2019, 9:32 PM IST

ఎస్పీ అట్టాడ

విశాఖ జిల్లా చింతపల్లి మండలం వీరవరంలో ఇద్దరు గిరిజనుల హత్యను ఎస్పీ బాబూజీ అట్టాడ ఖండించారు. ప్రశ్నించే గొంతులను మావోలు చంపేశారని తెలిపారు. 'ఇదే గ్రామానికి చెందిన సంజీవరావు అనే వ్యక్తిని 2014లో మావోలు హత్య చేశారని... గ్రామస్థులు ప్రతి దాడి చేయగా డీసీఎం, దళ సభ్యుడు చనిపోయారని గుర్తు చేశారు. తిరుగుబాటును జీర్ణించుకోలేని మావోలు వీరవరంపై దాడి చేసి 10 కుటుంబాలను వెళ్లగొట్టారని చెప్పారు. ఈ అన్యాయానికి ఎదురు తిరిగినందుకు భాస్కరరావు, సత్తిబాబును ఇవాళ ఉదయం హతమార్చారని ఎస్పీ బాబూజీ అట్టాడ తెలిపారు.

విశాఖ జిల్లా చింతపల్లి మండలం వీరవరంలో ఇద్దరు గిరిజనుల హత్యను ఎస్పీ బాబూజీ అట్టాడ ఖండించారు. ప్రశ్నించే గొంతులను మావోలు చంపేశారని తెలిపారు. 'ఇదే గ్రామానికి చెందిన సంజీవరావు అనే వ్యక్తిని 2014లో మావోలు హత్య చేశారని... గ్రామస్థులు ప్రతి దాడి చేయగా డీసీఎం, దళ సభ్యుడు చనిపోయారని గుర్తు చేశారు. తిరుగుబాటును జీర్ణించుకోలేని మావోలు వీరవరంపై దాడి చేసి 10 కుటుంబాలను వెళ్లగొట్టారని చెప్పారు. ఈ అన్యాయానికి ఎదురు తిరిగినందుకు భాస్కరరావు, సత్తిబాబును ఇవాళ ఉదయం హతమార్చారని ఎస్పీ బాబూజీ అట్టాడ తెలిపారు.

సంబందిత కథనం.. విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

శివనామస్మరణతో గడేకల్లు భీమలింగేశ్వర స్వామి ఆలయం మారుమోగింది. అశేష జనవాహిని భక్తి నీరాజనాల మధ్య శ్రీ భీమలింగేశ్వర రథోత్సవం కమనీయంగా జరిగింది.

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్లులో భక్తుల కోరిన కోరికలు తీర్చే దైవంగా నిలిచిన శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఉదయం నుండి స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు అభిషేకాలు మహామంగళహారతి తదితర పూజలు జరిపారు. స్వామి వారికి భక్తులు టెంకాయలు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. బలిహారణ తదితర పూజల అనంతరం ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం అశేష జనవాహిని మధ్య భీమలింగేశ్వర స్వామి వారి రథోత్సవం కమనీయంగా జరిగింది. భీమలింగేశ్వర స్వామి నమస్మరణతో గడేకల్లు పులకరించింది. ఆంధ్రరాష్ట్రం నుండే కాకుండా కర్నాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది భక్తులు హాజరై ఉంటారని అంచనా.


Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 18-07-2019
sluge : ap_atp_71_18_bheemalingeswara_swamy_rathosthavam_av_AP10097
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.