విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ విభాగం అవినీతిలో కూరుకుపోయిందని దాడి ఆరోపించారు. సకాలంలో పనులు జరగటం లేదని... అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శక, అవినీతి లేని పాలనను అందించాలని చూస్తుంటే అధికారులు దానికి భిన్నంగా వ్యవహరించటం సరైంది కాదన్నారు.
ఇదీ చదవండి: