ETV Bharat / state

జగన్ పాలనకు ఎక్స్​పైరీ డేట్ వచ్చింది.. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.. : చంద్రబాబు

author img

By

Published : Apr 5, 2023, 9:56 PM IST

Updated : Apr 6, 2023, 6:22 AM IST

chandrababu fire on Cm jagan : ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంపై కన్నేసిన జగన్.. ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్నాడని, నాలుగేళ్ల పాలనలో విశాఖలో గంజాయి, గన్ కల్చర్ తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ టైం ఐ పోయింది.. జగన్ ఎక్స్​పైరీ డేట్ వచ్చింది.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని, జగన్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

Etv Bharat
Etv Bharat
చంద్రబాబు నాయడు

chandrababu fire on Cm jagan : వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీల వేధింపులపై ప్రశ్నిస్తే.. వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జోన్‌ 1 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అందరికీ సమాన అవకాశాలు.. సమాన గౌరవం దక్కేలా తెలుగుదేశం పనిచేసిందని తెలిపారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

దళితులకు ఉన్నత అవకాశాలు టీడీపీ హయాంలోనే... బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే మా పార్టీ పనిచేస్తోందని, దళిత మహిళను శాసనసభ స్పీకర్‌గా, బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘనత మాదేనని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు రావాలని, సమాన గౌరవం దక్కాలని అన్నారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిని చంద్రబాబు సత్కరించారు. ఎమ్మెల్యేలను బానిస గా చూసిన జగన్.. ఎమ్మెల్సీ ఓటమితో ఎవ్వరినీ తీయ్యను అని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నాడని అన్నారు. మోసం చేసేవారిని ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్న చంద్రబాబు.. ఒక్క దెబ్బకు దిగివచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారని జగన్​ను ఉద్దేశించి అన్నారు. విశాఖ తనకు ఎంతో ఇష్టమైన నగరం అని.. సుజల స్రవంతి పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, భోగాపురం విమానాశ్రయంలో వీళ్లు ఒక్క ఇటుక వేయలేదని, పోలవరం ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

అక్రమాలపై దర్యాప్తు... విశాఖలో సగం సింహాచల భూములేనని.. ఆ భూములు ఇచ్చిన అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నాకు విశాఖ ఇష్టం.. ఇక్కడ నాకు ఇల్లు లేదు.. నేను భూములు అక్రమించను, భూ అక్రమాలు జరగనివ్వను అని చంద్రబాబు తెలిపారు. ప్రశాంతమైన విశాఖ లో గంజాయి, గన్ కల్చర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. విశాఖలోని ప్రజల ఆస్తుల మీద జగన్‌ కన్ను పడిందని.. ప్రభుత్వ భూముల ఆక్రమణపై సిట్ తో దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.

టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు కడితే.. జగన్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయాడని, రైతు బజార్లు తాకట్టు పెట్టాడని చెప్పారు. విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తున్నారని, విశాఖకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మా దరిద్రం, జగన్ ఈ రాష్ట్రానికి శని... రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోయింది... విశాఖ మీద జగన్ కన్ను పడింది... ఇక్కడి ఆస్తుల మీదే ప్రేమ అని ధ్వజమెత్తారు. జగన్ టైం ఐ పోయింది. జగన్ ఎక్స్​పైరీ డేట్ వచ్చింది.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాసాడని, జగన్ కి డేంజర్ బెల్సో మోగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

ఇవీ చదవండి :

చంద్రబాబు నాయడు

chandrababu fire on Cm jagan : వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీల వేధింపులపై ప్రశ్నిస్తే.. వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జోన్‌ 1 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అందరికీ సమాన అవకాశాలు.. సమాన గౌరవం దక్కేలా తెలుగుదేశం పనిచేసిందని తెలిపారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

దళితులకు ఉన్నత అవకాశాలు టీడీపీ హయాంలోనే... బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే మా పార్టీ పనిచేస్తోందని, దళిత మహిళను శాసనసభ స్పీకర్‌గా, బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘనత మాదేనని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు రావాలని, సమాన గౌరవం దక్కాలని అన్నారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిని చంద్రబాబు సత్కరించారు. ఎమ్మెల్యేలను బానిస గా చూసిన జగన్.. ఎమ్మెల్సీ ఓటమితో ఎవ్వరినీ తీయ్యను అని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నాడని అన్నారు. మోసం చేసేవారిని ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్న చంద్రబాబు.. ఒక్క దెబ్బకు దిగివచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారని జగన్​ను ఉద్దేశించి అన్నారు. విశాఖ తనకు ఎంతో ఇష్టమైన నగరం అని.. సుజల స్రవంతి పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, భోగాపురం విమానాశ్రయంలో వీళ్లు ఒక్క ఇటుక వేయలేదని, పోలవరం ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

అక్రమాలపై దర్యాప్తు... విశాఖలో సగం సింహాచల భూములేనని.. ఆ భూములు ఇచ్చిన అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నాకు విశాఖ ఇష్టం.. ఇక్కడ నాకు ఇల్లు లేదు.. నేను భూములు అక్రమించను, భూ అక్రమాలు జరగనివ్వను అని చంద్రబాబు తెలిపారు. ప్రశాంతమైన విశాఖ లో గంజాయి, గన్ కల్చర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. విశాఖలోని ప్రజల ఆస్తుల మీద జగన్‌ కన్ను పడిందని.. ప్రభుత్వ భూముల ఆక్రమణపై సిట్ తో దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.

టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు కడితే.. జగన్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయాడని, రైతు బజార్లు తాకట్టు పెట్టాడని చెప్పారు. విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తున్నారని, విశాఖకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మా దరిద్రం, జగన్ ఈ రాష్ట్రానికి శని... రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోయింది... విశాఖ మీద జగన్ కన్ను పడింది... ఇక్కడి ఆస్తుల మీదే ప్రేమ అని ధ్వజమెత్తారు. జగన్ టైం ఐ పోయింది. జగన్ ఎక్స్​పైరీ డేట్ వచ్చింది.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాసాడని, జగన్ కి డేంజర్ బెల్సో మోగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 6, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.