ETV Bharat / state

'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'

author img

By

Published : Dec 6, 2019, 5:08 AM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు, యాజమాన్యంతో మంత్రి అవంతి భేటీ అయ్యారు.పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న నేపథ్యంలో వారితో భేటి అయిన అవంతి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'
'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'

విశాఖ స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పరిశ్రమ భూములను పాస్కో అనే సంస్థకు భాగస్వామ్యం పేరిట ధారాదత్తం చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చెందుతుండగా... వారితో, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో మంత్రి భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తే అడ్డుకుని తీరతామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కొత్త స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకై పాస్కో సంస్థతో భాగస్వామ్యం గురించి కేంద్రం ముందు ప్రతిపాదన వచ్చిందే తప్ప... ప్రస్తుతమున్న పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేదేమీ లేదని విశాఖ ఉక్కు సీఎండీ పీకే రథ్‌ స్పష్టం చేశారు.

'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'
"విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినంత వరకూ పాస్కో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతిపాదిత జాయింట్ వెంచర్‌ వేరే...కేంద్రం అధీనంలో ఉన్న మన పరిశ్రమ వేరే. ఈ క్షణంలో నేను ఈ స్పష్టత ఇవ్వదల్చుకున్నాను. వచ్చిన ప్రతిపాదనను సమీక్షిస్తున్నామే తప్ప అంతకుమించి ఏమీ లేదు." - పీకే రథ్‌, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ

ఇదీచదవండి

కియా కార్ల పరిశ్రమ విస్తరణకు సహకరిస్తాం: సీఎం జగన్

విశాఖ స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పరిశ్రమ భూములను పాస్కో అనే సంస్థకు భాగస్వామ్యం పేరిట ధారాదత్తం చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చెందుతుండగా... వారితో, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో మంత్రి భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తే అడ్డుకుని తీరతామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కొత్త స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకై పాస్కో సంస్థతో భాగస్వామ్యం గురించి కేంద్రం ముందు ప్రతిపాదన వచ్చిందే తప్ప... ప్రస్తుతమున్న పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేదేమీ లేదని విశాఖ ఉక్కు సీఎండీ పీకే రథ్‌ స్పష్టం చేశారు.

'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'
"విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినంత వరకూ పాస్కో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతిపాదిత జాయింట్ వెంచర్‌ వేరే...కేంద్రం అధీనంలో ఉన్న మన పరిశ్రమ వేరే. ఈ క్షణంలో నేను ఈ స్పష్టత ఇవ్వదల్చుకున్నాను. వచ్చిన ప్రతిపాదనను సమీక్షిస్తున్నామే తప్ప అంతకుమించి ఏమీ లేదు." - పీకే రథ్‌, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ

ఇదీచదవండి

కియా కార్ల పరిశ్రమ విస్తరణకు సహకరిస్తాం: సీఎం జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.