ETV Bharat / state

3 జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురికి గాయాలు

author img

By

Published : Jan 27, 2021, 11:05 AM IST

3 జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడగా... శ్రీకాకుళం జిల్లాలో కారును...ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

road-accident
road-accident

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకన్న పాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పైడిసాల నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు, నర్సీపట్నం వైపు వస్తున్న మరో కారు... పశువులను తప్పించబోయి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పశువుల కాపరి మహాలక్ష్మితో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని... ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై కారును... ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సత్యనారాయణ.... బాధితులను తన వాహనంపై ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకన్న పాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పైడిసాల నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు, నర్సీపట్నం వైపు వస్తున్న మరో కారు... పశువులను తప్పించబోయి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పశువుల కాపరి మహాలక్ష్మితో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని... ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై కారును... ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సత్యనారాయణ.... బాధితులను తన వాహనంపై ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.