ETV Bharat / state

అమరావతి కోసం పాయకరావుపేటలో ర్యాలీ

అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నేతలు, రైతులు ర్యాలీ చేపట్టారు. రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Oct 11, 2020, 3:43 PM IST

rally for amaravathi in payakarao pet
అమరావతి కోసం పాయకరావుపేటలో ర్యాలీ

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులకు చేరుకున్నాయి. వారికి సంఘీభావం ప్రకటిస్తూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నాయకులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. భూములిచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులకు చేరుకున్నాయి. వారికి సంఘీభావం ప్రకటిస్తూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నాయకులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. భూములిచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.