ETV Bharat / state

విద్యుత్​ తీగలకు వెదురు కర్రలు తగిలి వ్యక్తి మృతి

వెదురు కర్రలు విద్యుత్ తీగలకు తగిలి.. వాటిని తీసుకెళ్తున్న ఓ వ్యక్తి మరణించాడు. విశాఖ జిల్లా చినగోగాడలో స్వీపర్​గా పనిచేసే బొబ్బాది రాజు మృతితో.. అతని ఇరువురు కుమార్తెలు అనాథలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Nov 8, 2020, 6:15 PM IST

person death with electric shock
విద్యుదాఘాంతంతో మృతి చెందిన రాజు

పాక నిర్మాణానికి వెదురు కర్రలు తీసుకువస్తుండగా.. విద్యుత్ తీగలకు తగిలి రాజు అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా చినగోగాడలో జరిగింది. బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

విశాఖ జిల్లా చీడికాడ మండలం చినగోగాడ గ్రామానికి చెందిన బొబ్బాది రాజు.. పాక నిర్మాణానికి అవసరమైన వెదురు కర్రలు నరికి తీసుకువస్తున్నాడు. అనుకోకుండా అవి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గ్రామంలో అతడు స్వీపర్​గా పని చేస్తున్నాడు. మృతుడి భార్య కొన్నాళ్ల క్రితమే చనిపోవడంతో.. ఇద్దరు ఆడ పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు వారు అనాథలుగా మిగిలిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాక నిర్మాణానికి వెదురు కర్రలు తీసుకువస్తుండగా.. విద్యుత్ తీగలకు తగిలి రాజు అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా చినగోగాడలో జరిగింది. బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

విశాఖ జిల్లా చీడికాడ మండలం చినగోగాడ గ్రామానికి చెందిన బొబ్బాది రాజు.. పాక నిర్మాణానికి అవసరమైన వెదురు కర్రలు నరికి తీసుకువస్తున్నాడు. అనుకోకుండా అవి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గ్రామంలో అతడు స్వీపర్​గా పని చేస్తున్నాడు. మృతుడి భార్య కొన్నాళ్ల క్రితమే చనిపోవడంతో.. ఇద్దరు ఆడ పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు వారు అనాథలుగా మిగిలిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఏజెన్సీలో పోలీసుల ముమ్మర తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.