పాక నిర్మాణానికి వెదురు కర్రలు తీసుకువస్తుండగా.. విద్యుత్ తీగలకు తగిలి రాజు అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా చినగోగాడలో జరిగింది. బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.
విశాఖ జిల్లా చీడికాడ మండలం చినగోగాడ గ్రామానికి చెందిన బొబ్బాది రాజు.. పాక నిర్మాణానికి అవసరమైన వెదురు కర్రలు నరికి తీసుకువస్తున్నాడు. అనుకోకుండా అవి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గ్రామంలో అతడు స్వీపర్గా పని చేస్తున్నాడు. మృతుడి భార్య కొన్నాళ్ల క్రితమే చనిపోవడంతో.. ఇద్దరు ఆడ పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు వారు అనాథలుగా మిగిలిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: