ETV Bharat / state

తెదేపా అసత్య ప్రచారం మానుకోవాలి: ఎమ్మెల్యే - jagananna vidya deevena scheme at narsiptnam

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. విశాఖ జిల్లా మల్లవరం రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని ఆయన పరిశీంచారు.

mla uma shankar ganesh visit colored stone quarry
రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్
author img

By

Published : Apr 20, 2021, 10:19 AM IST

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అధికార పార్టీపై తెదేపా అసత్య ప్రచారం ఎక్కువ చేస్తోందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం మల్లవరం రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. తన అనుచరులు అటవీ ప్రాంతంలో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు చేస్తున్నట్లు నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తెదేపాలో వివిధ పదవులు పొందిన ఆ పార్టీ నాయకుడు కొండలరావు జిరాయతీ భూమిలో మట్టి తవ్వుకుంటే మాకేంటి సంబంధమని ప్రశ్నించారు. వాస్తవం తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే గౌరవం తగ్గిపోతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. వైకాపా మెరుగైన పాలనను చూసి తట్టుకోలేక బురదజల్లుడు రాజకీయం చేయడం వారికి తగదని చెప్పారు.

జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం

jagananna vidya deevena scheme at narsiptnam
జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉన్నత చదువులు చదువుకోడానికి పేదలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని.. అందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

తొలివిడతగా ఈనెల 19న శ్రీకారం చుట్టగా మలివిడతగా ఈ ఏడాది జూలై, డిసెంబర్, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో దశల వారీగా నిధులు విడుదల అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కేవలం విద్యార్థుల తల్లి ఖాతాలో జమచేసి వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్ స్థాయి అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ అధికారులు సత్యనారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

నేడే.. వైఎస్సాఆర్ సున్నా వడ్డీ రాయితీ నిధుల విడుదల

కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అధికార పార్టీపై తెదేపా అసత్య ప్రచారం ఎక్కువ చేస్తోందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం మల్లవరం రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. తన అనుచరులు అటవీ ప్రాంతంలో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు చేస్తున్నట్లు నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తెదేపాలో వివిధ పదవులు పొందిన ఆ పార్టీ నాయకుడు కొండలరావు జిరాయతీ భూమిలో మట్టి తవ్వుకుంటే మాకేంటి సంబంధమని ప్రశ్నించారు. వాస్తవం తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే గౌరవం తగ్గిపోతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. వైకాపా మెరుగైన పాలనను చూసి తట్టుకోలేక బురదజల్లుడు రాజకీయం చేయడం వారికి తగదని చెప్పారు.

జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం

jagananna vidya deevena scheme at narsiptnam
జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉన్నత చదువులు చదువుకోడానికి పేదలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని.. అందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

తొలివిడతగా ఈనెల 19న శ్రీకారం చుట్టగా మలివిడతగా ఈ ఏడాది జూలై, డిసెంబర్, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో దశల వారీగా నిధులు విడుదల అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కేవలం విద్యార్థుల తల్లి ఖాతాలో జమచేసి వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్ స్థాయి అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ అధికారులు సత్యనారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

నేడే.. వైఎస్సాఆర్ సున్నా వడ్డీ రాయితీ నిధుల విడుదల

కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.