ETV Bharat / state

సింహాచలం గోశాలలో పాతవారినే నియమించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం

author img

By

Published : Jul 16, 2020, 4:48 PM IST

Updated : Jul 16, 2020, 5:46 PM IST

పాతవారికే మళ్లీ గోశాల సంరక్షణ బాధ్యతలు
పాతవారికే మళ్లీ గోశాల సంరక్షణ బాధ్యతలు

16:46 July 16

పాతవారికే మళ్లీ గోశాల సంరక్షణ బాధ్యతలు

సింహాచలం గోశాల వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ స్పందించారు. గోశాలలో పాతవారినే నియమించాలని దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్​ అర్జునరావును ఆదేశించారు. కృష్ణాపురం, గోశాలకు సంబంధించి ఆరోపణలు సరికాదన్న మంత్రి.. దేవాల‌యాల విషయంలో రాజ‌కీయాల‌కు తావులేదని స్పష్టం చేశారు. 

సింహాచలం పాత గోశాలలోని 85కు పైగా దూడలను రాత్రికి రాత్రే దేవస్థానం అధికారులు తరలించినట్లు తెలిసింది. లేగ దూడలను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత కొద్ది రోజులగా గోశాలలో లేగదూడలు, పెయ్యలు చనిపోతున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న మూగజీవాలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూడల తరలింపు అంశంపై స్పందించిన మంత్రి పాతవారినే నియమించేలా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి..

'సింహాచలం గోశాలలో గోవులు కనిపించడం లేదు'

16:46 July 16

పాతవారికే మళ్లీ గోశాల సంరక్షణ బాధ్యతలు

సింహాచలం గోశాల వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ స్పందించారు. గోశాలలో పాతవారినే నియమించాలని దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్​ అర్జునరావును ఆదేశించారు. కృష్ణాపురం, గోశాలకు సంబంధించి ఆరోపణలు సరికాదన్న మంత్రి.. దేవాల‌యాల విషయంలో రాజ‌కీయాల‌కు తావులేదని స్పష్టం చేశారు. 

సింహాచలం పాత గోశాలలోని 85కు పైగా దూడలను రాత్రికి రాత్రే దేవస్థానం అధికారులు తరలించినట్లు తెలిసింది. లేగ దూడలను ఎటు తీసుకువెళ్లారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత కొద్ది రోజులగా గోశాలలో లేగదూడలు, పెయ్యలు చనిపోతున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న మూగజీవాలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూడల తరలింపు అంశంపై స్పందించిన మంత్రి పాతవారినే నియమించేలా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి..

'సింహాచలం గోశాలలో గోవులు కనిపించడం లేదు'

Last Updated : Jul 16, 2020, 5:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.