ETV Bharat / state

ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం

విశాఖపట్నం జిల్లా కొయ్యూరులోని బాలుర ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. వీరిని మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద గుర్తించినట్టు తెలిపిన ఉపాధ్యాయులు... విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

author img

By

Published : Mar 19, 2021, 10:05 PM IST

identify of missing students in koyyuru ashrama school in vizag district
ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం

విశాఖపట్నం జిల్లా కొయ్యూరులోని బాలుర ఆశ్రమం పాఠశాల నుంచి ఈనెల రెండో తేదీన రాహుల్​ గాంధీ, విజయ్​కుమార్, లక్ష్మణరావు అనే ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. ముగ్గురు విద్యార్థులతో పాటు ఇదే పాఠశాలకు చెందిన ఒప్పంద ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా... వారు మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా కొయ్యూరులోని బాలుర ఆశ్రమం పాఠశాల నుంచి ఈనెల రెండో తేదీన రాహుల్​ గాంధీ, విజయ్​కుమార్, లక్ష్మణరావు అనే ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. ముగ్గురు విద్యార్థులతో పాటు ఇదే పాఠశాలకు చెందిన ఒప్పంద ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా... వారు మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

అదుపుతప్పిన వరి నూర్పు యంత్రం... ఇద్దరు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.