ETV Bharat / state

డుడుమ జలాశయానికి వరద ప్రవాహం

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని జలాశయాలకు వరద పోటెత్తింది. జోలాపుట్​ జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు చేరడం వల్ల అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

author img

By

Published : Oct 29, 2019, 3:09 PM IST

వరద కారణంగా ప్రమాద స్థాయికి చేరిన డుడుమ జలాశయం
వరద కారణంగా ప్రమాద స్థాయికి చేరిన డుడుమ జలాశయం

ఎడతెరిపిలేని వర్షాలకు విశాఖలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వానలకు ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. జోలాపుట్​ జలాశయం సామర్థ్యం 2750 అడుగులు కాగా... 2748.55 అడుగులకు చేరింది. దాదాపు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ కారణంగా డుడుమ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 2588.60 అడుగులకు చేరింది. నీటి ఉద్ధృతి కారణంగా అధికారులు డుడుమలోని మూడు గేట్లను నీటిని బలిమెలకు విడుదల చేశారు.

వరద కారణంగా ప్రమాద స్థాయికి చేరిన డుడుమ జలాశయం

ఎడతెరిపిలేని వర్షాలకు విశాఖలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వానలకు ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. జోలాపుట్​ జలాశయం సామర్థ్యం 2750 అడుగులు కాగా... 2748.55 అడుగులకు చేరింది. దాదాపు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ కారణంగా డుడుమ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 2588.60 అడుగులకు చేరింది. నీటి ఉద్ధృతి కారణంగా అధికారులు డుడుమలోని మూడు గేట్లను నీటిని బలిమెలకు విడుదల చేశారు.

ఇదీ చూడండి:

రైవాడ జలాశయం... ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం..

Intro:ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన జలశయాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి


Body:2750 అడుగుల నీటి సామర్థ్యం గల జోలపుట్ జలాశయం ప్రమాద స్థాయికి 2748.55చేరిపోయింది. జోలాపుట్నుంచి నాలుగు వేల క్యూసెక్కులు వరద నీటిని దిగువన గల డుడుమకు విడుదల చేస్తున్నారు


Conclusion:ఎగువన గల జోలా ఫుట్ జలాశయంలో లో నీటి విడుదల కారణంగా దిగువన గల డుడుమజలాశయం లో నీటి ఉధృతి పెరిగింది.2590 అడుగులు సామర్థ్యం గలా డుడుమ లో ప్రస్తుతం 2588.60 చేరింది.డుడుమ లో మూడు గేట్స్ ఎత్తి ఐదువేల క్యూసెక్స్ నీటిని బలిమెల కు విడుదల చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.