ఎడతెరిపిలేని వర్షాలకు విశాఖలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వానలకు ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. జోలాపుట్ జలాశయం సామర్థ్యం 2750 అడుగులు కాగా... 2748.55 అడుగులకు చేరింది. దాదాపు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ కారణంగా డుడుమ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 2588.60 అడుగులకు చేరింది. నీటి ఉద్ధృతి కారణంగా అధికారులు డుడుమలోని మూడు గేట్లను నీటిని బలిమెలకు విడుదల చేశారు.
ఇదీ చూడండి: