ETV Bharat / state

కె.కోటపాడులో 580 కిలోల గంజాయి పట్టివేత - విశాఖపట్నం ముఖ్యాంశాలు

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం బత్తివానిపాలె వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులో తీసుకోగా... ముగ్గురు పరారయ్యారు.

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
author img

By

Published : Feb 7, 2021, 2:04 PM IST


విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం బత్తివానిపాలెం వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 580 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులో తీసుకోగా.. మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11.60 లక్షలు ఉంటుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.


విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం బత్తివానిపాలెం వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 580 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులో తీసుకోగా.. మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11.60 లక్షలు ఉంటుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి: కోనాం సర్పంచి పదవికి అత్తా కోడలు పోటీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.