శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. నిన్న సాయంత్రం ఐదు గంటలతో మూడోదశ ప్రచారానికి గడువు ముగిసింది. గ్రామాల్లో అభ్యర్థులు జోరుగా ర్యాలీలు నిర్వహించి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గుర్తులతో వినూత్నంగా ఇంటింటి ప్రచారం సాగించారు. ఆమదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలకు రేపు పోలింగ్ జరగనుంది. 293 గ్రామ పంచాయతీల్లోని సర్పంచులతో పాటు 2,648 వార్డు స్థానాలకు ప్రకటన ఇచ్చారు. వాటిలో 45 సర్పంచ్లతో పాటు 947 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా.. పోలీసులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండీ... రేపు మూడో దశ పంచాయతీ ఎన్నికలు