జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దైంది. హెలికాప్టర్లో వచ్చేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వని కారణంగానే పవన్ పర్యటన మానుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇవాళ పాతపట్నం, సోంపేట, ఇచ్ఛాపురం, చాపర, పలాసలో ప్రచారానికి పవన్ హాజరు కావాల్సింది. శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, రాజాంలో ఆదివారం పర్యటించాల్సి ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తున్నందున... రోడ్డు మార్గాన వచ్చేందుకు కల్యాణ్కు అనుమతి లభించలేదు. ఇక హెలికాప్టర్లో వచ్చేందుకు కనీసం 2 రోజుల ముందు అనుమతి పొందాల్సి ఉంటుంది. పార్టీ వర్గాలు ఈ అనుమతి కోసం అధికారులను సంప్రదించలేదని తీసుకోలేదని తెలుస్తోంది. ఒక్క రోజులో అనుమతి మంజూరయ్యే అవకాశం లేనందునే పవన్ పర్యటన రద్దు చేసుకున్నారని జనసేన వర్గాలు చెప్పాయి.
పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు
శ్రీకాకుళం జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ చేయాల్సిన పర్యటన రద్దైంది. హెలికాప్టర్లో వెళ్లేందుకు అనుమతి రాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దైంది. హెలికాప్టర్లో వచ్చేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వని కారణంగానే పవన్ పర్యటన మానుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇవాళ పాతపట్నం, సోంపేట, ఇచ్ఛాపురం, చాపర, పలాసలో ప్రచారానికి పవన్ హాజరు కావాల్సింది. శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, రాజాంలో ఆదివారం పర్యటించాల్సి ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తున్నందున... రోడ్డు మార్గాన వచ్చేందుకు కల్యాణ్కు అనుమతి లభించలేదు. ఇక హెలికాప్టర్లో వచ్చేందుకు కనీసం 2 రోజుల ముందు అనుమతి పొందాల్సి ఉంటుంది. పార్టీ వర్గాలు ఈ అనుమతి కోసం అధికారులను సంప్రదించలేదని తీసుకోలేదని తెలుస్తోంది. ఒక్క రోజులో అనుమతి మంజూరయ్యే అవకాశం లేనందునే పవన్ పర్యటన రద్దు చేసుకున్నారని జనసేన వర్గాలు చెప్పాయి.