Priyanka Gandhi Vadra Wayanad LS bypoll : మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో రెండు లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కేరళకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
ఆ ముగ్గురిని ఎంపిక - కేరళలో ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు తమ అభ్యర్థులను అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని బరిలో దించుతున్నట్లు హాస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రియాంకా గాంధీ పేరును ప్రకటించడంతో ఆమె తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతునట్టైంది.
ఇంకా పాలక్కడ్, చెలక్కార (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు రాహుల్ మమ్కూటథిల్, రమ్య హరిదాస్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే వీరిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.
Rahul Gandhi Wayanad : లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల(రాయ్ బరేలీ, వయనాడ్) నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్ బరేలీలోనే కొనసాగాలని గతంలో నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో కేరళలోని వయనాడ్ను వదులుకున్నారు. అందుకే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. జులై నెలలో ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Kerala Wayanad By Election Date : ఇప్పుడు వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ గెలిస్తే ఆమె తొలిసారిగా పార్లమెంటులోకి అడుగు పెట్టినట్టువుతుంది. పైగా ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లు కూడా అవుతుంది. కాగా, కేరళ వయనాడ్ లోక్సభ సీటుతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది.
10 విమానాలకు బాంబు బెదిరింపులు - ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!