ETV Bharat / state

నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్

శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్ తన నిజాయితీ చాటుకున్నారు. తనకు దొరికిన నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించాలని కోరారు.

author img

By

Published : May 12, 2020, 9:29 PM IST

Constable who is a sincerity at palakonda
నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్


శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్​కు బ్యాంక్ వద్ద టీ దుకాణంలో ఓ కవరు దొరికింది. అందులో 14,300 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును అతను తీసుకోకుండా స్టేట్ బ్యాంక్ మేనేజర్​కు అప్పగించారు. నగదు పోగొట్టుకున్నవారు సరైన ఆధారాలతో వస్తే తిరిగి ఇస్తామని మేనేజర్ తెలిపారు. నిజాయితీగా వ్యవహరించి డబ్బు అందజేసిన మదన్​మోహన్​ను డీఎస్పీ రారాజు ప్రసాద్, సీఐ ఆదాం, ఎస్సై జనార్ధనరావు అభినందించారు.


శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్​కు బ్యాంక్ వద్ద టీ దుకాణంలో ఓ కవరు దొరికింది. అందులో 14,300 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును అతను తీసుకోకుండా స్టేట్ బ్యాంక్ మేనేజర్​కు అప్పగించారు. నగదు పోగొట్టుకున్నవారు సరైన ఆధారాలతో వస్తే తిరిగి ఇస్తామని మేనేజర్ తెలిపారు. నిజాయితీగా వ్యవహరించి డబ్బు అందజేసిన మదన్​మోహన్​ను డీఎస్పీ రారాజు ప్రసాద్, సీఐ ఆదాం, ఎస్సై జనార్ధనరావు అభినందించారు.

ఇదీ చూడండి:'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.