ETV Bharat / state

'రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ'

author img

By

Published : Jun 4, 2020, 8:00 PM IST

ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఉచిత వైద్యం పేద, మధ్య తరగతి ప్రజల హక్కు అన్న ఆయన.. ఆ హక్కు నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ చేపడుతున్నట్లు ఆళ్ల నాని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రిమ్స్​లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరుస్తామని మంత్రి హామీఇచ్చారు.

మంత్రి ఆళ్ల నాని
మంత్రి ఆళ్ల నాని

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను మరింతగా మెరుగుపరుస్తామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పర్యటించిన ఆయన.. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జీజీహెచ్​లో సదుపాయాల కల్పనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ కేసుల విస్తృతిపై పవర్ పాయింట్​ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్​ స్థాయిలో ఆధునీకరించేందుకు రూ.16 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల పెంపు విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పేదవారందరికీ ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను మరింతగా మెరుగుపరుస్తామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పర్యటించిన ఆయన.. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జీజీహెచ్​లో సదుపాయాల కల్పనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ కేసుల విస్తృతిపై పవర్ పాయింట్​ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్​ స్థాయిలో ఆధునీకరించేందుకు రూ.16 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల పెంపు విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పేదవారందరికీ ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు.

ఇదీ చదవండి : అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.