ETV Bharat / state

ఈకేవైసీ అప్​డేట్​ అన్నాడు... 15వేలు  నొక్కేశాడు... - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

ఈకేవైసీ చేయించుకోకపోతే బ్యాంకు ఖాతా రద్దవుతుందని ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఖాతా నుంచి రూ.15 వేలు స్వాహా చేసిన ఘటన... శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. అయితే ప్రస్తుతం బాధితురాలు, వారి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

cyber crime in the name of ekyc at srikakulam
ఈకేవైసీ పేరుతో నగదు స్వాహా
author img

By

Published : Jun 8, 2020, 12:23 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని కోదండరామ వీధికి చెందిన ముద్దాడ లావణ్యకు ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఈకేవైసీ చేయించుకోవాలని, తాను పంపించే లింక్ తెరచి వివరాలు నమోదుచేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన లావణ్య వివరాలను నమోదు చేయగా...కాసేపటికి 5 వేల రూపాయల నగదు ఖాతా నుంచి తీసినట్లు, ఫోన్​కు మెసేజ్​ వచ్చింది. కొద్ది గంటల్లో మరో రూ.10వేలు స్వాహా చేశాడు.

మొదటిసారి నగదు తీసుకున్న సమయంలో సంబంధిత వ్యక్తి కి ఫోన్ లో సంప్రదిస్తే ఆందోళన చెందొద్దని, 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తమకు జరిగిన మోసంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలోని కోదండరామ వీధికి చెందిన ముద్దాడ లావణ్యకు ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేసి ఈకేవైసీ చేయించుకోవాలని, తాను పంపించే లింక్ తెరచి వివరాలు నమోదుచేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన లావణ్య వివరాలను నమోదు చేయగా...కాసేపటికి 5 వేల రూపాయల నగదు ఖాతా నుంచి తీసినట్లు, ఫోన్​కు మెసేజ్​ వచ్చింది. కొద్ది గంటల్లో మరో రూ.10వేలు స్వాహా చేశాడు.

మొదటిసారి నగదు తీసుకున్న సమయంలో సంబంధిత వ్యక్తి కి ఫోన్ లో సంప్రదిస్తే ఆందోళన చెందొద్దని, 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తమకు జరిగిన మోసంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఇవీ చూడండి

లైవ్:శ్రీశైలంలో ప్రయోగాత్మక దర్శనం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.