ETV Bharat / state

కరోనా కాటుకు.. మూగబోయిన మగ్గం.

మగ్గాల చప్పుళ్లతో మార్మోగిన ఆ ప్రాంతాలు ఇప్పుడు మూగబోయాయి. రాట్నం తిరగక.. దారం అందక.. వేరే దారి లేక జానెడు పొట్టను తడుముకుంటూ కంటతడి పెడుతున్నాడు. కారణం.. కరోనా, ఆ మహమ్మారి కోరలు చాచింది.. పట్టు, ఇతర ముడిసరకు దిగుమతి ఆగింది. లాక్‌డౌన్‌తో మగ్గాలు మూలనపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దారమే ఆధారమైన జీవనం.. ఇప్పుడు ఆధారం కోల్పోయి మౌనంగా రోదిస్తోంది.

author img

By

Published : Apr 27, 2020, 11:15 AM IST

Updated : Apr 27, 2020, 11:22 AM IST

Stop loom in cheerala
చీరాలలో మూగబోయిన మగ్గాలు
Stop loom in cheerala
చీరాలలో మూగబోయిన మగ్గాలు

ప్రకాశం జిల్లా చీరాల, కనిగిరి, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో నేత పనులు ఎక్కువగా జరుగుతుండగా- ఈ పరిశ్రమను నమ్ముకుని సుమారు 17 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్క చీరాలలోనే ఆరువేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ చీరాల అంటే చీరలకు పెట్టింది పేరు. అనేక రకాల చీరలు ఇక్కడ తక్కువకే లభిస్తాయని నమ్ముతారు. ఆ క్రమంలోనే రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొనుగోళ్లకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో నేతన్నల కష్టాలను లాక్‌డౌన్‌ రెట్టింపు చేసింది. ఎవరిని కదిపినా కన్నీళ్లే సమాధానమవుతున్నాయి. చైనా, ముంబయి, సూరత్‌ నుంచి దిగుమతి అయ్యే ముడి రావడం నిలిచిపోయింది. స్థానికంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో పట్టు నాణ్యతను బట్టి రూ.2,500 నుంచి రూ. నాలుగు వేలకు లభించగా- ఇప్పుడు అదే పట్టు రూ. ఆరు వేల నుంచి రూ. ఎనిమిది వేలు పలుకుతుండటంతో సుమారు సగం మంది మగ్గాలను పక్కన పెట్టారు. ముడి సరకు ఉన్నవారు.. ఆర్డర్లు తీసుకున్న వారు వ్యయ ప్రయాసలకు ఓర్ఛి. మగ్గానికి పని చెప్పినా.. వస్త్రాలకు సరైన ధర రాక కూలి సైతం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పరిమాణాల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో మగ్గాల చప్పుడు ఆగిపోయింది.

కోలుకోలేని దెబ్భ..

బతుకు బండిని నడిపేందుకు నిత్యం మగ్గాలతో పోరాటం చేస్తున్నాం. కష్టమైనా, నష్టమైనా దశాబ్దాలుగా సాగిస్తున్న నేత పనిపై కరోనా పిడుగు పడింది. ముడిసరకు ధరలు ఎక్కువ కావడం.. మగ్గంపై నేసిన వస్త్రం తయారీ ఎక్కడికక్కడ నిలిచిపోవడం.. గిట్టుబాటు ధర లభించకపోవడం తదితర కారణాలతో మగ్గాలు మూలన పడుతున్నాయి. చేనేత రంగం సంక్షోభంలో పడిపోయింది. - కాటూరి వెంకటేశ్వర్లు, చేనేత కార్మికుడు

ఇవీ చూడండి...

నిర్మానుష్యంగా మారిన సముద్రతీరాలు

Stop loom in cheerala
చీరాలలో మూగబోయిన మగ్గాలు

ప్రకాశం జిల్లా చీరాల, కనిగిరి, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో నేత పనులు ఎక్కువగా జరుగుతుండగా- ఈ పరిశ్రమను నమ్ముకుని సుమారు 17 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్క చీరాలలోనే ఆరువేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ చీరాల అంటే చీరలకు పెట్టింది పేరు. అనేక రకాల చీరలు ఇక్కడ తక్కువకే లభిస్తాయని నమ్ముతారు. ఆ క్రమంలోనే రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొనుగోళ్లకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో నేతన్నల కష్టాలను లాక్‌డౌన్‌ రెట్టింపు చేసింది. ఎవరిని కదిపినా కన్నీళ్లే సమాధానమవుతున్నాయి. చైనా, ముంబయి, సూరత్‌ నుంచి దిగుమతి అయ్యే ముడి రావడం నిలిచిపోయింది. స్థానికంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో పట్టు నాణ్యతను బట్టి రూ.2,500 నుంచి రూ. నాలుగు వేలకు లభించగా- ఇప్పుడు అదే పట్టు రూ. ఆరు వేల నుంచి రూ. ఎనిమిది వేలు పలుకుతుండటంతో సుమారు సగం మంది మగ్గాలను పక్కన పెట్టారు. ముడి సరకు ఉన్నవారు.. ఆర్డర్లు తీసుకున్న వారు వ్యయ ప్రయాసలకు ఓర్ఛి. మగ్గానికి పని చెప్పినా.. వస్త్రాలకు సరైన ధర రాక కూలి సైతం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పరిమాణాల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో మగ్గాల చప్పుడు ఆగిపోయింది.

కోలుకోలేని దెబ్భ..

బతుకు బండిని నడిపేందుకు నిత్యం మగ్గాలతో పోరాటం చేస్తున్నాం. కష్టమైనా, నష్టమైనా దశాబ్దాలుగా సాగిస్తున్న నేత పనిపై కరోనా పిడుగు పడింది. ముడిసరకు ధరలు ఎక్కువ కావడం.. మగ్గంపై నేసిన వస్త్రం తయారీ ఎక్కడికక్కడ నిలిచిపోవడం.. గిట్టుబాటు ధర లభించకపోవడం తదితర కారణాలతో మగ్గాలు మూలన పడుతున్నాయి. చేనేత రంగం సంక్షోభంలో పడిపోయింది. - కాటూరి వెంకటేశ్వర్లు, చేనేత కార్మికుడు

ఇవీ చూడండి...

నిర్మానుష్యంగా మారిన సముద్రతీరాలు

Last Updated : Apr 27, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.