ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు. కందుకూరు మండలం దివివారిపాలేనికి చెందిన పూర్ణ చంద్రరావు, అతని భార్య విజయలక్ష్మీ, కూతురు శ్రీవిద్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఒంగోలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న లారీ కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చూడండి: