ప్రకాశం జిల్లా పామూరులో నాటుసారా సేవించి.. 3 లీటర్ల లిక్కర్ను తన కారులో ఉంచి సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చావా రాజ్కుమార్ అనే వ్యక్తి సారా తాగి.. నాటుసారా గల వాటర్ బబుల్తో తన కారులో సంచరిస్తుండగా కరోనా విధులు నిర్వహిస్తోన్న ఎస్సై చంద్రశేఖర్ అతన్ని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: