ETV Bharat / state

ఒంగోలులో 50 సంవత్సరాల కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం

author img

By

Published : Jan 13, 2021, 10:58 PM IST

వారంతా కబడ్డీ క్రీడాకారులు.. 50 సంవత్సరాలుగా కబడ్డీ ఆటలో తరించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. వారిలో పలువురు కబడ్డీలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాలు, సొంత వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒకరిద్దరికి వచ్చిన ఆలోచన జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులందరినీ ఒక చోటుకు చేర్చింది. దాదాపు 200 మంది ఒక చోటుకు చేరిన అరుదైన... అపూర్వమైన సమ్మేళనానికి ఒంగోలు వేదికైంది.

old kabaddi players meet in ongole
కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం..

కబడ్డీ క్రీడకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా.. ఎంతోమంది ఆటగాళ్లు ఇక్కడి నుంచి తమ క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఆ ఆటతోనే చాలా మంది తమ జీవితాలను చక్కబెట్టుకున్నారు. మరెంతో మంది యువతకు మార్గం చూపారు. ఉద్యోగాలు, వ్యాపారులు, వివాహాలతో జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల లో నివసిస్తున్నారు. పత్రికలలో వచ్చే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం ఎందుకు నిర్వహించుకోకూడదని ఒంగోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావుకు వచ్చిన ఆలోచనను ఒంగోలు పేర్నమిట్టకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్​లో డీఎస్పీగా ఉన్న వేణుగోపాల్​తో పంచుకున్నారు.

అలా పురుడుపోసుకున్న ఆలోచన కార్యరూపం దాల్చింది. వాట్సాప్ గ్రూపును సృష్టించి ప్రకాశం జిల్లాకు చెందిన పూర్వ కబడ్డీ క్రీడాకారులకు ఆహ్వానం పలికారు. అలా 1970-2020 మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కబడ్డీ ఆటను ప్రారంభించి..రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడివారు.. వివిధ విభాగాల్లో ఉద్యోగంలో స్థిరపడిన వారు.. ఉన్నత పదవులు అలంకరించిన వారు.. వ్యాపారంలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు. గృహిణులుగా ఉన్నవారు... ఉద్యోగ విరమణ చేసిన వారు మొత్తం 270 మందిని గుర్తించారు. వారందరూ ఒక చోటుకు చేరడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. " గోల్డెన్ జూబ్లీ ప్రకాశం జిల్లా కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం" పేరుతో ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో అంతా సమావేశం అయ్యారు.

ఆత్మీయ పలకరింపులు.. ఆలింగనాలు.. కుశల ప్రశ్నలు..నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంతో ఆ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.. ఒకరినొకరు పలకరించుకుంటూ.. పొగడుకుంటూ.. జీవితంలో స్థిరపడటానికి కబడ్డీ ఏవిధంగా ఉపయోగపడిందో వివరించుకుంటూ నాటి అనుభూతిని పొందారు.

సమావేశం ఆద్యంతం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే బలరామ కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లా అడిసినల్ ఎస్పీ రవిచంద్ర ముఖ్య అతిథులుగా వచ్చారు. ఒక్కొక్కరు వేదిక పైకి వచ్చి అనుభవాలు పంచుకున్నారు. తమ గురువులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ క్రీడాకారిణులుగా రాణించి, స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని, పదవీవిరమణ చేసిన పూర్వ కబడ్డీ క్రీడాకారులు, క్రీడాకారిణులను ఘనంగా సత్కరించుకున్నారు.

పూర్వ కబడ్డీ క్రీడాకారుల సమ్మేళనానికి వచ్చిన వారిలో 50 మంది వరకు పోలీసు విభాగంలో.. 30 మంది వరకు రైల్వేలో వివిధ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.. కొందరు పోస్టల్ విభాగంలో.. మరికొందరు వివిధ కళాశాలల్లో పీఈటీ లుగా...ఇతర ఉద్యోగాల్లో పని చేసున్న వారు.. సొంతంగా పరిశ్రమలు స్థాపించిన వారు ఉన్నారు. అలానే వీరిలో కబడ్డీ ఆటతో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం రైల్వే లో ఉద్యోగం చేస్తున్నఎన్. అర్జున్ రావు... హైదరాబాద్​లో డీఎస్పీగా ఉన్న వేణుగోపాల్..మచిలీపట్నంలో.. ఏఎస్పీగా ఉన్న బి. సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

అలానే జిల్లాకు చెందింది పలువురు క్రీడాకారులుగా రాణించి.. వివిధ కారణాలతో మరణించిన వారి చిత్ర పటాలను పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం వహించారు. వారి కుటుంబ సభ్యులను వేదిక పైకి ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులుగా.. ప్రభుత్వ ఉద్యుగులుగా.. జిల్లాకు, రాష్టానికి, దేశానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. ఎంతో మందికి స్పూర్తిగా నిలవడమే కాకుండా. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడాన్ని అభినందించారు.

ఇదీ చదవండి: దర్శి సంక్రాంతి సంబరాలు 'కబడి పోటీల్లో' సత్తా చాటిన చినగంజాం జట్టు

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం..

కబడ్డీ క్రీడకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా.. ఎంతోమంది ఆటగాళ్లు ఇక్కడి నుంచి తమ క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఆ ఆటతోనే చాలా మంది తమ జీవితాలను చక్కబెట్టుకున్నారు. మరెంతో మంది యువతకు మార్గం చూపారు. ఉద్యోగాలు, వ్యాపారులు, వివాహాలతో జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల లో నివసిస్తున్నారు. పత్రికలలో వచ్చే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలా పూర్వ క్రీడాకారుల సమ్మేళనం ఎందుకు నిర్వహించుకోకూడదని ఒంగోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావుకు వచ్చిన ఆలోచనను ఒంగోలు పేర్నమిట్టకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్​లో డీఎస్పీగా ఉన్న వేణుగోపాల్​తో పంచుకున్నారు.

అలా పురుడుపోసుకున్న ఆలోచన కార్యరూపం దాల్చింది. వాట్సాప్ గ్రూపును సృష్టించి ప్రకాశం జిల్లాకు చెందిన పూర్వ కబడ్డీ క్రీడాకారులకు ఆహ్వానం పలికారు. అలా 1970-2020 మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కబడ్డీ ఆటను ప్రారంభించి..రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడివారు.. వివిధ విభాగాల్లో ఉద్యోగంలో స్థిరపడిన వారు.. ఉన్నత పదవులు అలంకరించిన వారు.. వ్యాపారంలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు. గృహిణులుగా ఉన్నవారు... ఉద్యోగ విరమణ చేసిన వారు మొత్తం 270 మందిని గుర్తించారు. వారందరూ ఒక చోటుకు చేరడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. " గోల్డెన్ జూబ్లీ ప్రకాశం జిల్లా కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం" పేరుతో ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో అంతా సమావేశం అయ్యారు.

ఆత్మీయ పలకరింపులు.. ఆలింగనాలు.. కుశల ప్రశ్నలు..నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంతో ఆ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.. ఒకరినొకరు పలకరించుకుంటూ.. పొగడుకుంటూ.. జీవితంలో స్థిరపడటానికి కబడ్డీ ఏవిధంగా ఉపయోగపడిందో వివరించుకుంటూ నాటి అనుభూతిని పొందారు.

సమావేశం ఆద్యంతం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే బలరామ కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లా అడిసినల్ ఎస్పీ రవిచంద్ర ముఖ్య అతిథులుగా వచ్చారు. ఒక్కొక్కరు వేదిక పైకి వచ్చి అనుభవాలు పంచుకున్నారు. తమ గురువులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ క్రీడాకారిణులుగా రాణించి, స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని, పదవీవిరమణ చేసిన పూర్వ కబడ్డీ క్రీడాకారులు, క్రీడాకారిణులను ఘనంగా సత్కరించుకున్నారు.

పూర్వ కబడ్డీ క్రీడాకారుల సమ్మేళనానికి వచ్చిన వారిలో 50 మంది వరకు పోలీసు విభాగంలో.. 30 మంది వరకు రైల్వేలో వివిధ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.. కొందరు పోస్టల్ విభాగంలో.. మరికొందరు వివిధ కళాశాలల్లో పీఈటీ లుగా...ఇతర ఉద్యోగాల్లో పని చేసున్న వారు.. సొంతంగా పరిశ్రమలు స్థాపించిన వారు ఉన్నారు. అలానే వీరిలో కబడ్డీ ఆటతో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం రైల్వే లో ఉద్యోగం చేస్తున్నఎన్. అర్జున్ రావు... హైదరాబాద్​లో డీఎస్పీగా ఉన్న వేణుగోపాల్..మచిలీపట్నంలో.. ఏఎస్పీగా ఉన్న బి. సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

అలానే జిల్లాకు చెందింది పలువురు క్రీడాకారులుగా రాణించి.. వివిధ కారణాలతో మరణించిన వారి చిత్ర పటాలను పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం వహించారు. వారి కుటుంబ సభ్యులను వేదిక పైకి ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులుగా.. ప్రభుత్వ ఉద్యుగులుగా.. జిల్లాకు, రాష్టానికి, దేశానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. ఎంతో మందికి స్పూర్తిగా నిలవడమే కాకుండా. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడాన్ని అభినందించారు.

ఇదీ చదవండి: దర్శి సంక్రాంతి సంబరాలు 'కబడి పోటీల్లో' సత్తా చాటిన చినగంజాం జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.