ఇదీ చదవండి: నిండా ముంచిన వర్షం..!
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది.
కుటంబ కలహాలతో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కనిగిరి రజక వీధిలో ఉంటున్న కోమటిగుంట్ల సాయి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకే ఈ పని చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడు గతేడాది కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు కనిగిరిలో వీరిద్దరు కాపురం పెట్టారు. మనస్పర్థలు వచ్చాక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. సాయి ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రాలేదని మృతుడు తల్లిదండ్రులు వివరించారు. పైగా అత్తంటి వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాక మానసికంగా కుంగిపోయిన సాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సాయి ఆత్మహత్యకు అత్తింటివారే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిండా ముంచిన వర్షం..!
sample description